Tirumala Stampede: తిరుమలలో భారీ ట్రాఫిక్ జాం

తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. కానీ ఇంతలోనే భక్తులు వెంకటేశ్వురుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. దీంతో తిరుమలలోని ఘాట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

New Update
Tirumala Ghat road

Tirumala Ghat road Photograph: (Tirumala Ghat road)

తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల మధ్య తొక్కిసలాట (Tirumala Stampede) జరగడంతో ఆరుగురు మృతి చెందిన విషాదం గురించి తెలిసిందే. ఇది జరిగి ఎన్ని గంటలు కాకపోయిన కూడా తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డు దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపుగా 4 కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు రోడ్డు మీద వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు తిరుమలలో ఘాట్ రోడ్డుపై ఇంత ట్రాఫిక్ లేదని పలువురు అంటున్నారు. భారీ ట్రాఫిక్ వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.   

ఇది కూడా చూడండి:  Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

నిర్వహణ లోపం కారణంగానే..

ఇదిలా ఉండగా.. వైకుంఠ ద్వార సర్వ దర్శనానికి టీటీడీ టోకెన్లు జారీ సమయంలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం, టికెట్ల జారీ సమయాన్ని మార్చడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

ఒక్కసారిగా క్యూలైన్లలోకి వదిలేయడంతో..

వైకుంఠ దర్శనం కోసం సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచే తిరుపతి చేరుకున్నారు. రాత్రికి అన్ని టోకెన్ల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. పోలీసులు భక్తులను పద్మావతి పార్కులోకి వదిలి క్యూలైన్లలోకి అనుమతించారు. కానీ టోకెన్లు  జారీ చేసే సమయంలో ఒక్కసారిగా భక్తులను వదిలేయడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
ttd crime news

ttd crime news

AP Crime: తిరుమల నుండి తిరుపతికి వెళ్తున్న ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డుప్రమాదం భక్తుల్లో ఆందోళన కలిగించింది. సోమవారం ఉదయం 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో ఏడుగురు కర్ణాటకకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తిచేసుకుని తిరుపతికి తిరుగుబాటుగా బయలుదేరిన ఈ వాహనం అతి వేగంగా వచ్చిన సమయంలో మలుపులో నియంత్రణ కోల్పోయింది. వాహనం బోల్తా పడటంతో అందులో ఉన్న వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

అతి వేగంతో..

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు, 108 ఎమర్జెన్సీ సర్వీసులకు అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను బయటకు తీసి చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతావారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ వేగంగా నడిపిస్తున్నాడని, కొన్ని సార్లు మలుపుల్లో కాస్త భయంగా అనిపించినట్లు గాయపడిన ఓ భక్తుడు తెలిపారు.

 

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల వేగంపై నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భక్తులు ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

( ap-crime-news | ap crime updates | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment