Bandi Sanjay: హిందువుల మనోభావాలను గాయపర్చారు వారిని భగవంతుడు క్షమించడు

తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందువుల మనోభావాలను గాయపర్చిన వారిని భగవంతుడు ఎప్పటికీ క్షమించడంటూ ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

author-image
By Manogna alamuru
New Update
minister

Tirumala Laddu Issue: ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల జంతువుల ఫ్యాట్ ఉపయోగిస్తారా...ఇది పద్ద మోసం.. క్షమించరాని నేర అంటూ అని ధ్వజమెత్తారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీ బోర్డ్ గొండితనం, నేరపూరిత స్వభావం ఇది అంటూ దుయబట్టారు. తాము ఇంతకు ముందే తిరుమలలో మిగతా మతస్థుల ఇన్వాల్వ్‌మెంట్ గురించి కంప్లైంట్ చేశామని అన్నారు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇది వారిపనే అంటూ బండి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతోంది లాంటి అసలు నిజాలను బయటకు తీసుకురావాలని అన్నారు. తిరుమల పవిత్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Also Read :  తెలంగాణలో మూడు రోజులు పాటు వానలు..అలెర్ట్‌ ప్రకటించిన ఐఎండీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు