TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది.

New Update
TTD

TTD

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు వ్యయప్రయాసలు కూర్చి దేశ,విదేశాల నుంచి వస్తుంటారు. కానీ స్వామి వారి దర్శనం, వసతి గదుల విషయం లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇక రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు దర్శనం కోసం 24 గంటల నుంచి 48 గంటల వరకు వేచి ఉండాల్సి  వస్తుంది. ఈ మేరకు సామాన్య భక్తులకు దర్శనం మరింత త్వరగా పూర్తయ్యేందుకు టీటీడీ కీలక అడుగులు ముందుకు వేస్తుంది. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాయంతో.. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శన టోకెన్‌ పొందడం, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ప్రవేశించేందుకు ‘ఫేస్‌ రికగ్నిషన్‌ ఎంట్రీ’ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు తిరుమలలో డెమో కూడా పూర్తయినట్లు ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్‌ ఖాతాలో ట్వీట్ చేశారు. తిరుమలలో ఓ సంస్థ డెమో ఇచ్చింది.

Also Read: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!

'భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభంగా, వేగంగా అందించాలనే టీటీడీ చైర్మన్  గొప్ప సంకల్పానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలు, రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాసే భక్తులకు 2 నుండి 3 గంటల వ్యవధిలోనే దర్శనభాగ్యం కల్పించాలని గత నెలలో జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో తీర్మానించారు. 

Also Read: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!

అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిపుణులైన పలు సంస్థలు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలుస్తున్నారని చెప్పారు. 'ఈ క్రమంలో AI Powered Facial Recognized Q-Management Systemలో అనుభవం గల.. Aaseya and Ctruh రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సిస్టమ్‌తో టీటీడీ చైర్మన్ దగ్గరకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సదరు సంస్థ ప్రతినిధులు రూపొందించిన కాన్సెప్ట్‌ను పాలకమండలి ఛైర్మన్, సభ్యులకు సంస్థ ప్రతినిధులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 

Also Read: ఇక అల్లు అర్జున్‌ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

ఫేస్ రిగక్నైజేషన్ రికార్డ్‌తో పాటు కియోస్కి మిషన్ స్లిప్ జనరేట్ చేస్తుంది.. ఆ స్లిప్‌లో కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చిన భక్తులు ఫేస్ రీడింగ్ ద్వారా లేదా బార్ కోడ్ స్లిప్ స్కాన్ ద్వారా దర్శనానికి అనుమతించే విధానాన్ని పరిశీలన చేపట్టారు. ప్రస్తుతం డెమో ఇచ్చిన రెండు కంపెనీలు 14 దేశాల్లో సేవలందిస్తున్నారు.వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపథ్యంలో, ఆచరణ యోగ్యమైన విధానాన్ని ఫైనల్ చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నారు'అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment