/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
TTD
Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. లడ్డూ కౌంటర్ లలో 47 వ నంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బ్రేకింగ్ న్యూస్
— prabha 🦅 (@JSPKFollower1) January 13, 2025
తిరుమలలో మరో అపశృతి
తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం pic.twitter.com/4CmwozY5dx
Also Read: Kumbh Mela: నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!
షార్ట్ సర్య్కూట్...
కౌంటర్ లోని కంప్యూటర్ యూపీఎస్ లో షార్ట్ సర్య్కూట్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు.మరో వైపు తిరుమల లడ్డూ కౌంటర్ ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.
Also Read: BRS MLA: కలెక్టరేట్ రసాభాస ఘటన..కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు!
ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత..స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా..కాసేపు అక్కడున్న భక్తులు ఆందోళన కు గురయ్యారు.
Also Read: Hollywood: హాలీవుడ్ ప్రముఖులపై మండిపడుతున్న జనాలు!
Also Read: Ukrain: దొరికే సూచనలుంటే మీరే చచ్చిపోండి: ఉత్తర కొరియా