Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే?

దక్షిణ మధ్యరైల్వే మరికొన్ని ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య 6ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జనవరి 11,12, 15,16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం మధ్య, జనవరి 8,9 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రైళ్లు నడవనున్నాయి.

New Update
Special Trains

Special Trains

దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ తెలిపింది. మరికొన్ని స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. కాచిగూడ - శ్రీకాకుళం, చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య దాదాపు 6 స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. 

కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య - జనవరి 11, 12, 15, 16 తేదీల్లో రాకపోకలు జరగనున్నాయి. 

అలాగే చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య - జనవరి 8, 9 తేదీల్లో రెండు స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.

Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

కాచిగూడ -  శ్రీకాకుళం రోడ్ మధ్య

కాచిగూడ -  శ్రీకాకుళం రోడ్ మధ్య (07615) ట్రైన్ జనవరి 11, 15 తేదీల్లో నడవనుంది. 
కాచిగూడలో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. 

Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ మధ్య

అలాగే శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ మధ్య జనవరి 12, 16 తేదీల్లో నడవనుంది. 
శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 7.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అయితే ఈ రైలులో అన్నీ థర్డ్‌ ఏసీ కోచ్‌లే ఉండటం గమనార్హం. 

ఈ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. 

Also Read : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!

spl train
spl train

 

చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య

చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య (07617) ట్రైన్ జనవరి 8న నడవనుంది. 
చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకోనుంది. 

శ్రీకాకుళం - చర్లపల్లి మధ్య

Also Read : ఆ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

శ్రీకాకుళం - చర్లపల్లి మధ్య (07618) ట్రైన్ జనవరి 9న నడవనుంది. 
శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. ఈ రైలులో ఫస్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయి. 

ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP - TG Earthquake: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపింది. భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

New Update
earthquake warning for Andhra Pradesh and Telangana soon

earthquake warning for Andhra Pradesh and Telangana soon

ఈ మధ్య వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని భూప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే దేశ, ప్రపంచ వ్యాప్తంగా భూమి కంపించింది. అందులో గతంలో ఏపీ, తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాలను భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

తాజాగా మరోసారి భూకంప హెచ్చరికలు వచ్చాయి. తెలంగాణలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా భారీ భూకంపం ప్రజలను భయపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి భూకంప తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

ఏపీ & తెలంగాణలో భూకంపం

ఈ మేరకు Epic -Earthquake Research & Analysis ఒక ట్వీట్‌ చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్‌.. అలాగే అమరావతి వరకు ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చింది. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

అయితే ఈ భూకంపాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. కాగా అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణలేని సమాచారంపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

(ap earthquake | ap earthquake latest news latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment