Road accident : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని వస్తుండగా కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం  వద్ద లారీ ఢీకొట్టింది.

New Update
Road accident

Road accident

 Road accident : శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్నారు. అనంతరం కుమారుడితో పాటు మరో ఇద్దరితో కలిసి పాతపట్నానికి కారులో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం  వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనకు అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు సేఫ్టీ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని, నిషేధిత పదార్థాలు తరలించొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cm Chandra Babu: సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం.. YSR జిల్లా పేరు మారుస్తూ నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరును మారుస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగా నిర్ణయం తీసుకున్నారు.

New Update
CM Chandrababu Naidu taken Shocking decision to YSR district name change

CM Chandrababu Naidu taken Shocking decision to YSR district name change

ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా పేరును మార్చారు. ఈ మేరకు కొత్త పేరును యాడ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న వైఎస్‌ఆర్ జిల్లాను ఇకపై వైఎస్ఆర్ కడప‌గా జిల్లా పేరు మార్చాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగగా.. అందులో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు యాడ్ చేస్తూ కెబినెట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి YSR జిల్లాను YSR కడప జిల్లాగా పరిగణించనున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాగానే దీనికి పేరు ఉండేది. కానీ గత టెర్మ్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ జిల్లా పేరులోని కడప తొలగించి.. వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. 

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

ఇదిలా ఉంటే గతంలో రెండు పర్యాయాలు సీఎంగా YS రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఆయన 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణానంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం YS రాజశేఖరరెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా పేరును YSR కడప జిల్లాగా మార్చింది.

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. వైసీపీ అధినేత, వైఎస్ఆర్ తనయుడు జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా పేరును మార్చారు. అందులోని కడపను తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సోమవారం జరిగిన కేబినెట్‌లో వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. . . . .

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment