Kakinada: ఒక్క చేప ధర ఏకంగా రూ.3.95 లక్షలు.. అంతలా ఏముందబ్బా!

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది.. మార్కెట్‌కు తీసుకెళ్లగా రికార్డుస్థాయి ధరకు అమ్ముడైంది. ఆదివారం రోజు స్థానిక మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప దొరికింది.దీనిని ఓ వ్యాపారి రూ.3.95 లక్షలకు దక్కించుకున్నారు

New Update
kachidi

kachidi

మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు అప్పుడప్పుడు కొన్ని అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా కొన్నిసందర్భాల్లో దొరికే ఒక్క చేప వల్ల మత్స్యకారుల జీవితాలు మారిపోతాయి.. కొన్ని చేపలకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఏకంగా రూ.లక్షల్లో పలుకుతాయి.  ఈ అరుదైన చేపలు కూడా గోదావరి జిల్లాల్లో మత్స్యకారుల వలకు ఎక్కువగా వస్తూంటాయి. తాజాగా కాకినాడలో మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది.. కాసుల వర్షం కురిపించింది.

Also Read:Health Tips: ఖాళీ కడుపుతో నెల రోజుల పాటు ఈ డ్రై ఫ్రూట్ వాటర్‌ తాగితే శరీరం ఉక్కులా మారుతుంది అంతే!

కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారుల వలకు ఆదివారం 25 కిలోల కచిడి చేప లభించింది. ఈ అరుదైన చేపగా కచిడి చేప మత్స్యకారులకు కాసులు కురిపించింది.ఈ చేపను కుంభాభిషేకం రేవులో విక్రయించగా ఏకంగా రూ.3.95 లక్షలు పలికింది. ఈ చేపకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అందుకే అంత డిమాండ్ ఉందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఔషధ గుణాలు ఉంటాయని.. అందుకే దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుందని మత్స్యకారులు తెలియజేస్తున్నారు.

Also Read:Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!

ఈ కచిడి చేప సాంకేతిక నామం ప్రొటోనిబియా డయాకాన్తస్‌. ఈ చేపల రెక్కలు గరుకుగా, చిన్నగా ఉంటాయి.. చేప పొట్ట భాగం మాత్రం గట్టిగా ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. వీటిలో కూడా మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తాయి.. అందుకే వీటిని గోల్డ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపలు రుచిగా ఉంటాయి.. అలాగే ఔషధగుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. డాక్టర్లు సర్జరీల తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యకారులు వివరిస్తున్నారు.

 అంతేకాదు పలురకాల మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నఈ చేప రికార్డు స్థాయి ధర పలుకుతోంది.

Also Read: Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్‌ అదిరిందిగా..!

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment