మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్‌పై పవన్ సంచలన ప్రకటన!

మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్‌కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

New Update

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌ అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోవడంతో గాయాలు అయిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన సింగపూర్ నుంచి హైదరాబాద్‌కి వచ్చారు. ఈ క్రమంతో తన కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా ఓ అప్డేట్ ఇచ్చారు. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న..

సింగపూర్‌లో సమ్మర్ క్యాంప్‌లో జరిగిన ఘటనలో గాయపడిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సినిమా కుటుంబసభ్యులు, మిత్రులు అందరికి కూడా నా ధన్యవాదాలని తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను తీసుకుని ఇండియాకి వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

New Update
Terror Attack Vijayawada

Terror Attack Vijayawada

Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిచింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో పోలీస్‌ విభాగాలు అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికలపై పోలీసులు   నిఘా పెట్టారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

విజయవాడ టార్గెట్‌గా..!

కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రెండు నెలల క్రితమే విజయవాడను టార్గెట్‌గా ఉంచుకుని ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో, నగరంలోని కొందరు వ్యక్తులపై పోలీస్‌ శాఖ నిఘా పెంచింది. తాజా సమాచారం ప్రకారం, సిమి (SIMI) తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే నలుగురు అనుమానితులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఈ నలుగురిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి కదలికలపై పక్కాగా నిఘా పెట్టారు. విచారణలో ఇంకా నలుగురు సిమి అనుచరులు విజయవాడలో తలదాచుకుని ఉన్నట్లు తెలిపారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ప్రస్తుతం మొత్తం ఎనిమిది మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి చిన్న సమాచారం‌ను జాగ్రత్తగా విశ్లేషిస్తూ, ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కలిసి పని చేస్తున్నాయి.

దేశ భద్రతను సవాల్ చేసేలా మారుతున్న ఉగ్రవాద కదలికలను ముందే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం  ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించిన పరిణామాలు ఇంకా చల్లారకముందే, విజయవాడ వంటి శాంతియుత నగరాల్లో ఉగ్ర ముప్పు వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment