Pawan Kalyan: పవన్ పర్యటనలో తొక్కిసలాట.. బాలికకు సీరియస్!

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.

New Update
Pawan Kalyan Krishna Tour

Pawan Kalyan Pawan Kalyan Krishna Dist Tour

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గొడవర్రు వద్ద అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న పవన్ పెనమలూరు నియోజక వర్గం గోశాల ప్రాంతంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను, వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.
ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్‌ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్‌ భారీ సాయం

గుడివాడలోనూ పర్యటన..

గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెంలోనూ పవన్ పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకు వచ్చారు. దీంతో రూ. 3.8 కోట్ల నిధులు కేటాయంచి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేయించారు. 

14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో సోమవారం పవన్ కళ్యాణ్ మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment