Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update

పాస్టర్ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాస్టర్ ప్రవీణ్‌ ది ముమ్మాటికీ హత్యే అని జీవీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇందుకు సంబంధించి హర్షకుమార్ సాక్ష్యాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు దర్యాప్తు అధికారికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, రాజానగరం పోలీస్ట్ స్టేషన్ పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసులను జీవీ హర్షకుమార్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ నోటీసులు నిజాన్ని దాయగలవా? హర్షకుమార్ ను ఆపగలవా? అంటూ పోస్ట్ చేశారు. 

Also Read :  ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!

Also Read :  ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!

ముమ్మాటికీ హత్యే: హర్ష కుమార్ ఆరోపణలు

ఇదిలా ఉంటే.. ప్రవీణ్‌ మృతిపై మాజీఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముమ్మాటికీ ఇది హత్యేనన్నారు. ప్రవీణ్‌ది హత్య అనడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయన్నారు. హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు లేదా క్రైస్తవ మతోన్మాదులు ఈ హత్యకు కారణం కావొచ్చన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే కేసుపై అనుమానాలు రేకెత్తాయన్నారు.

Also Read :  ప్రవీణ్ ది హత్యే.. పోలీసులు దాస్తున్న విషయాలివే.. మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు!

పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కేసు విచారణ సక్రమంగా జరగకపోతే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లి రీ ఇన్వెస్టిగేషన్ జరిగేలా చూస్తానన్నారు. నిన్న తాము సంయమనం పాటించడం వల్లే పోలీసులు మృతదేహాన్ని హైదరాబాద్ తరలించగలిగారన్నారు. 

(telugu-news | latest-telugu-news | telugu breaking news | today-news-in-telugu | telugu crime news | andhra-pradesh-news)

Also Read :  పాస్టర్ ప్రవీణ్ ను చంపింది వాడే.. నా దగ్గర ప్రూఫ్స్.. కేఏ పాల్ సంచలనం!-VIDEO

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment