AP Schools: మా బడి మాకు కావాలి.. MEO ఆఫీస్ ముందు గ్రామస్తుల నిరసన!

గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూసివేయడంపై నెల్లూరు జిల్లా యాతలూరు ప్రజలు ఆందోళనకు దిగారు. 47 ఏండ్ల నుంచి నడుస్తున్న స్కూల్ తీసివేసి తమ బిడ్డలను ఆగం చేయొద్దని కోరుతున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ కలిసి ఏంఈవో ఆఫీసుముందు నిరసన చేపట్టారు. 

New Update
nellore sc

nellore sc Photograph: (nellore sc)

AP Schools: ఏపీలో పలు స్కూల్స్ మూసివేయడంపై విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చదువుకున్న బడిలోనే తమ బిడ్డలను ఊళ్లోనే చదివించుకుంటామని దయచేసి ప్రభుత్వ పాఠశాలలు మూసివేయొద్దని కోరుతున్నారు. ఆనాటి ఆనాటి నుండి ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయి ఎదిగారు. నేటి ప్రభుత్వం దళితవాడలోని పాఠశాలను వేరే ప్రాంతంలోని పాఠశాలలో విలీనం చేయడం తగదంటున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా యాతులూరు గ్రామ హరిజనవాడ పాఠశాల స్టూడెంట్స్, పేరెంట్స్ కలిసి ఏంఈవో ఆఫీసుముంద ఆందోళన చేపట్టారు.

47 ఏళ్ల పాఠశాల..

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల యాతలూరు దళితవా డ గ్రామస్తులు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఎంపీడీవో కోటేశ్వరరావుకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నూక తొట్టి చిట్టెమ్మ, గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. యాతలూరు హరిజనవాడలో ప్రాథమిక పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత 47 ఏళ్ల నుండి ఈ గ్రామ దళితవాడలో పాఠశాల నడుస్తోంది. ఈ స్థలం దాతలు ఇచ్చిందే కాగా దాతల సహాయంతోనే స్కూల్ భవన్ నిర్మించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: PM Modi: అదాని కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే తమ గ్రామంలోని పాఠశాల ఉండాల్సిందేనంటున్నారు. తమ పిల్లలు వేరే ప్రాంతం తరలించొద్దని మండల విద్యాశాఖ అధికారిని వెంకటేశ్వర్లుకు పంజాబ్ చిన్న గురవయ్య, కోలం చెంచు కృష్ణయ్య విద్యార్థి తండ్రితోపాటు పలువురు వినతిపత్రం ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: RBI: న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకుకు బిగ్ షాక్.. కార్యకలాపాలు నిషేధించిన ఆర్బీఐ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

  • Apr 10, 2025 08:52 IST

    ఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!

    జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

    Karimnagar Wife And Husband Incident🔴LIVE : ప్రేమపెళ్లి.. 6 నెలలకే కొట్టి చంపి | Jagtial News | RTV



Advertisment
Advertisment
Advertisment