Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!

తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు.

New Update
Nandamuri Balakrishna Padma Vibhushan

Nandamuri Balakrishna Padma Vibhushan

ప్రముఖ టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు కేంద్రం నిన్న పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.

Also Read :  అదిరిపోయిందిగా... విజయ్ 69 మూవీ టైటిల్ ఫిక్స్!

Also Read :  ఖడ్గం పెట్టిన భయం.. తుపాకీతో శ్రీకాంత్, అండర్ గ్రౌండ్ లోకి కృష్ణవంశీ

ప్రేక్షకులకు రుణపడి ఉంటా..

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు.

Also Read :  ప్రముఖ దర్శకుడు మృతి.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ!

Also Read :  పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీళ్లే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment