/rtv/media/media_files/2025/03/19/p0woL6Np1PVuXlYq5CuN.jpg)
NTTPS Fire Accident in Kondapalli, NTR district
NTTPS Fire Accident:
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కొండపల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS) కోల్ ప్లాంట్లో ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో కోల్ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు దగ్గర మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. NTTPS అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
వారి నిర్లక్ష్యం కారణంగా స్టేజ్-1 బంకర్కి వెళ్లే కన్వేయర్ బెల్ట్.. 40 మీటర్ల మేర మంటలతో దగ్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 420 యూనిట్ల మేర విద్యుత్ నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: టెస్లా కార్లు తగలబెట్టడం ఉగ్రవాద చర్యే: మస్క్!