Prakasam: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ..తొలిసారి ప్యాసింజర్‌ రైలు!

ఏపీలో కొత్త రైలు మార్గం ఏర్పడింది. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.నేటితో వారి కల తీరింది. ఆ రూట్లో కొత్త రైలు ట్రయల్ రన్ ని అధికారులు పూర్తిచేశారు.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

Ap: ఏపీలో కొత్త రైలు మార్గంలో.. కొత్త రైల్వే స్టేషన్‌ ఏర్పాటైంది. నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో ప్రకాశం జిల్లా కీలకంగా మారింది. ముఖ్యంగా దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.నేటితో వారి కల తీరింది. దర్శిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా.. రైళ్ల రాకపోకల కోసం ట్రయల్ రన్ వేస్తున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత కొత్త రైల్వే స్టేషన్‌కు ప్యాసింజర్‌ రైలు వచ్చి ఆగింది. 

Also Read: Ap: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచే ఆ పథకం అమలు!

మరోసారి దర్శికి చాలాకాలం తరువాత ప్యాసింజర్ రైలు రావడంతో ఆ ప్రాంత ప్రజల ఆనంద పడుతున్నారు. దర్శిలో తాజాగా ప్యాసింజర్ రైలుతో అధికారులు ట్రయల్‌ రన్‌ వేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రయాణికులతో రైలు దర్శి స్టేషన్‌కు చేరింది. దీంతో ఈ రైలును చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈక్రమంలోనే పొదిలి మండలం మల్లవరం వరకు జరిగిన కొత్త రైల్వే లైన్ పనులను అధికారులు పరిశీలిస్తారు.

Also Read: Plane Crash: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్

ట్రయల్ రన్ కూడా...

అయితే కోర్టులో కేసుల కారణంగా పొదిలి సమీపంలో కొంత దూరం మేర పనులు ఆగిపోయాయి.. ఆ కేసులు కూడా క్లియర్ అయితే పొదిలి వరకు రైలును నడిపేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. రైల్వే అధికారులు నడికుడి- శ్రీకాళహస్తి లైన్‌ పనుల్లో వేగాన్నిపెంచారు. ఈ కొత్త రైలు మార్గంలో నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులను అధికారుల పూర్తి చేశారు. ట్రయల్ రన్ కూడా సక్సెస్‌ అయ్యింది. 

Also Read: Amith Shah:కశ్మీర్ పేరు మార్పు?  ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా

ప్రస్తుతానికి దర్శి వరకు రైళ్లు నడిచేందుకు లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే పొదిలికి కూడా రైళ్లు పరుగులు పెట్టనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కనిగిరి వరకు ట్రాక్ ఏర్పాటు అవ్వనుంది.

Also Read: Delhi: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు