/rtv/media/media_files/2025/04/04/yFtK5AbO9ESQWc7ZrVbO.jpg)
kodali nani..
మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ ఏప్రిల్ 2న విజయవంతంగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు ఈ సర్జరీ నిర్వహించి సక్సెస్ చేశారు. ఇక సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో కొడాలి నాని సన్నిహితులు, వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఐసీయూలో పర్యావేక్షణలో
ఇదిలా ఉంటే నాని ఆరోగ్య పరిస్థితిపై వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకర్లతో సమావేశంలో మాట్లాడారు. కొడాలి నానికి బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఆయన అన్నారు. హాస్పిటల్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో సుమారు 8 నుంచి 10 గంటల పాటు ట్రీట్మెంట్ జరిగిందని తెలిపారు. ఈ సర్జరీ అనంతరం నాని కొద్ది రోజులపాటు ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ప్రస్తుతం నాని బాగానే ఉన్నారని.. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని వైద్యులు ధ్రువీకరించినట్లు హనుమంతరావు పేర్కొన్నారు. అంతేకాకుండా కొడాలి నాని అభిమానులకు మరో షాకింగ్ అప్డేట్ చెప్పారు. ఆయన మరో నెల రోజులపాటు ముంబయిలోనే ఉంటారని అన్నారు. వీలైనంత త్వరగా కొడాలి నాని కోలుకుని తిరిగి మనందరి ముందుకు రావాలని తామంతా ఆకాంక్షిస్తున్నామన్నారు. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు టెన్షన్ పడుతున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
(kodali nani | ap-ycp | latest-telugu-news | telugu-news)
AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
Purandeshwari
AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..
వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news
Life Style: 20-20-20 ఫార్ములా ఎప్పుడైనా ట్రై చేశారా? స్క్రీన్స్ ముందు ఉండేవారికి ఇది చాలా ముఖ్యం
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!
Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్