Andhra Pradesh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జర్మనీలో ఉద్యోగాలు: మంత్రి నారా లోకేశ్

జర్మనీలో 3 లక్షలమంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నర్సింగ్ చదివే విద్యార్థులకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి ఆ దేశంలో ఉపాధి కల్పిస్తాన్నారు. ఈ మేరకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

New Update
Minister Nara Lokesh

Minister Nara Lokesh

బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాలు ఎంవోయుపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ''జర్మనీలో వృద్ధుల సంరక్షణ, హాస్పిటల్స్‌లో 3 లక్షలమంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉంది. యూరప్‌లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో నర్సింగ్ చేసిన విద్యార్థినులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.

Minister Nara Lokesh
Minister Nara Lokesh

 

Also Read: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ఈ శిక్షణ వల్ల ఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజితో ఉద్యోగాలు లభిస్తాయని'' అన్నారు.  మరోవైపు స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ఉజ్వల్ చౌహన్ మాట్లాడుతూ ''తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 వేలమందికిపైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించాం. స్కిల్ బి అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ రిక్రూట్‌మెంట్ స్టార్టప్‌లలో ఒకటిగా ఉంది. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నాం. 

Also Read: ముగిసిన కుంభామేళా.. వారికి రూ. 10 వేల బోనస్.. సీఎం యోగి కీలక ప్రకటన

 ఎపీఎస్ఎస్డీసీ భాగస్వామ్యంతో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం స్పెషలైజేషన్‌తో గ్రాడ్యుయేషన్ పొందిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇప్పిస్తాం. ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తాం. స్కిల్‌బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎపీఎస్ఎస్డీసీలు భాషా నైపుణ్య కొరతను పరిష్కరించి, ఏపిని నైపుణ్య రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4 వేలమందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని'' తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ఎపీఎస్ఎస్డీసీ సిఈవో గణేష్ కుమార్ తదితరలు పాల్గొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment