Shivaratri: శ్రీకాళహస్తిలో అర్థరాత్రి అఘోరా క్షుద్ర పూజలు!

శ్రీకాలహస్తిలో అఘోర క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శివరాత్రి రోజే అర్థరాత్రి భక్త కన్నప్ప ఆలయంలో లిందోగ్భావం సమయంలో క్షుద్ర పూజలు తలపించేలా మంత్రాలు చదవడంతో జాగారానికి వచ్చిన భక్తులు భయాందోళన గురైయ్యారు. అతను తమిళనాడు నుంచి వచ్చినట్లు చెప్పాడు.

New Update
srikalahasthi aghora

srikalahasthi aghora Photograph: (srikalahasthi aghora)

శివరాత్రి రోజు అర్థరాత్రి ఆయలంలో అఘోరా క్షుద్ర పూజల కలకలం రేపాయి. శ్రీకాళహస్తిలోని భక్తకన్నప్ప దేవాలయంలో ఓ అఘోరా హల్ ఛల్ చేశాడు. లిందోగ్భావం సమయంలో ఆలయం పరిసరాల్లో క్షుద్ర పూజలు తలపించేలా మంత్రాలు చదవడంతో గ్రామస్తులు, ఆలయ సిబ్బంది భయాందోళన చెందారు. శివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు జాగారం చేయడానికి అధిక సంఖ్యలో భక్త కన్నప్ప ఆలయానికి వచ్చారు. వారు అఘోరా విఛిత్ర పూజలతో భయభ్రాంతులకు గురయ్యారు.

Also read : Detox Drinks: శరీరాన్ని శుభ్రపరిచే మూడు డీటాక్స్‌ డ్రింక్‌లు

శ్రీకాళహస్తి ఆలయ సిబ్బంది సెక్యూరిటీ ఎవరు కూడా ఆ అఘోరాను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. అక్కడ ఉన్న భక్తులే అఘోరాని ప్రశ్నించారు. ఎక్కడ నుంచి వచ్చావు? ఎవరు నీవు? ఏ పూజలు నిర్వహిస్తున్నావని భక్తులు అఘోరాని అడిగారు. అతను తమిళనాడు నుంచి వచ్చానని అఘోరా భక్తులకు చెప్పాడు. భక్తులు అడిగిన ప్రశ్నలకు అఘోరా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. అర్ధరాత్రి ఇలాంటి పూజ నిర్వహించడంతో భక్తులు అయోమయంలో పడిపోయారు.

Also read : SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Murder: ఏపీలో యువకుడి దారుణ హత్య.. అడ్డుకున్న స్నేహితుడి గుండెల్లో పొడిచి!

ఏపీలో మరో మర్డర్ జరిగింది. నర్సీపట్నం తలుపులమ్మ జాతరలో మహేష్, దుర్గా ప్రసాద్ మద్యం సేవించి గొడపడ్డారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ కోపం చల్లారని మహేష్.. ప్రసాద్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపాడు. మరో స్నేహితుడిపై దాడి చేశాడు. 

New Update
ap murder

AP Narsipatnam young man Murder case

AP Murder: ఏపీలో మరో దారుణ మర్డర్ జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇటీవల మద్యం మత్తులో హత్యల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా 6 నెలల క్రితం మద్యం మత్తులో మున్సిపల్ పరిధిలోని కొత్త వీధిలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. తాజాగా ఇదే తరహాలో మున్సిపాలిటీ పరిధిలోని అయ్యన్న కాలనీలో ఇద్దరు యువకుల ఘర్షణ జరిగింది.

ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి..

ఈ మేరకు అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వాళ్లకు సర్ది చెప్పి పంపించేశారు. కానీ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో హతుడు రుత్తల దుర్గా ప్రసాద్ ఇంటికి వెళ్లి చిత్రాడ మహేష్ మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మహేష్ అనే యువకుడు ప్రసాద్ అనే యువకుడిని కత్తితో గుండుల మీద పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన సాయి అనే యువకుడ్ని కూడా పొట్ట భాగంలో కత్తితో పొడిచాడు. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఘటన గురించి తెలియగానే అక్కడకు వెళ్లిన సిఐ జి.గోవిందరావు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీలో మంగళవారం రాత్రి తలుపులమ్మ తల్లి పండగ జరిగింది. జాతర జరుగుతున్న సమయంలో చిత్రాడ మహేష్, రుత్తల దుర్గా ప్రసాద్ మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ప్రసాద్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇదే సమయంలో అడ్డుగా వచ్చిన మరో యువకుడికి కూడా గాయాల య్యాయని సీఐ తెలిపారు. నిందితుడు మహేష్ పరార్ అయ్యాడని, గాలిస్తున్నామని తెలిపారు.

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

guntur | friends | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment