Ration card : తెల్లరేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌...వచ్చే నెలనుండి ఇది కూడా

తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏప్రిల్ నుండి కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనుంది. గత కొన్నినెలలుగా కందిపప్పు కొరత ఏర్పడింది. అయితే మార్కెట్‌లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటంతో పంపిణీని పునఃప్రారంభిస్తున్నారు.

New Update
TS Ration Card : కొత్త కార్డుల కోసం ఎదురు చూపులేనా!

Ration cards

Ration card : తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏప్రిల్ నుండి కంది పప్పు పంపిణీని పునఃప్రారంభిం చనుంది. గత కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో పప్పు పంపిణీని నిలిపివేసింది. అయితే మార్కెట్‌లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటంతో తిరిగి కందిపప్పు సరాఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. 

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
 
 రెండు, మూడు నెలలుగా రేషన్‌కార్డులు ఉన్నవారికి కందిపప్పు సరిగా అందడం లేదు. దీంతో అధికారులు కందిపప్పు పంపిణీపై దృష్టిసారించారు. ఏప్రిల్లో కందిపప్పు పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం మూడు జిల్లాల్లోనే కంది పండుతోంది. ఆ మూడు జిల్లాల నుంచే కంది పప్పును కొనుగోలు చేసి ప్రభుత్వం రాష్ట్రమంతటా సరఫరా చేయాల్సి ఉంది. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పలుకుతోందని ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు కంది రైతులు తమ పంటను అమ్మేస్తున్నారు.

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

దీంతో ప్రభుత్వం వద్ద ఉన్న కంది నిల్వలు సరిపోవడం లేదు. మహారాష్ట్ర నుంచి కందిపప్పు తెప్పించి ఇస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ముందుగా డీడీలు కట్టిన డీలర్లకు కందిపప్పు సరఫరా చేసినా.. సుమారు 50 శాతం మందికి మాత్రమే అందింది. మార్చి నెలలో ఎవరికీ కందిపప్పు అందలేదు. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి డిపోల ద్వారా పూర్తి స్థాయిలో బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు పంపిణీ చేశారు. జనవరిలో కందిపప్పు పప్పు పంపిణీ అంతంతమాత్రంగానే జరిగింది. మార్చిలో పంచదార, బియ్యం మాత్రమే ఇచ్చారు. రేషన్‌ షాపుల్లో కిలో కందిపప్పు రూ.67కే ఇస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో ధర రూ.120 నుంచి రూ.160 వరకు ఉంది. దీంతో వినియోదారులు సైతం రేషన్‌ షాపుల్లోనే కంది పప్పు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కంది పప్పు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అంతే కాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లకు తగిన విధంగా పేదలకు రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాగుల ఉత్పత్తి సరిపడా లేదు, అందుకే రాయలసీమకు మాత్రమే రాగుల పంపిణీని పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జొన్నలు అందిం చేందుకు సిద్ధమయ్యారు. కొన్ని జిల్లాల్లో ప్రజలు జొన్నలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతేడాది అక్టోబరు నుంచి కందిపప్పు, గోధుమ పిండి సరఫరాను పునరుద్ధరించారు. కానీ స్టాక్‌ లేకపోవడంతో కంది పప్పును మార్చి నెలలో ఇవ్వలేకపోయారు. మరి ఏప్రిల్‌లో అయినా పూర్తి స్థాయిలో కంది పప్పును ప్రతి కార్డు దారుడికి ఇస్తారా లేదో చూడాలి.

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు