తిరుమలలో నకిలీ టికెట్లు కలకలం.. ఇంటి దొంగల పనే

తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు రూ.300 స్పెషల్ దర్శనం నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించి దర్శనం చేయిస్తున్నారు. కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్‌లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

New Update
tirumala employee

tirumala employee Photograph: (tirumala employee)

తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు దళారీలు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లు భక్తులకు ఇచ్చి స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. టికెట్లపై అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర విజిలెన్స్ వింగ్ అధికారులు టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్ లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కూడా మంగళవారం టోల్‌ గేట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన విషయం తెలిసిందే. శ్రీశైలం ఆలయానికి వెళ్లే దారిలో ఎంట్రన్స్‌ లో ఎన్నో సంవత్సరాలుగా ఒక టోల్‌ గేట్‌ నిర్వహిస్తున్నారు. టోల్‌గేట్‌లో పని చేసే సిబ్బంది.. గత కొంత కాలంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు భారీగా వినపడుతున్నాయి. 

Read also ;శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!

అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో కొందరు నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్‌ల నుంచి వచ్చిన భక్తులకు విక్రయించి సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేశారు ఇంటి దొంగలు. వైకుంఠ దర్శనాలకు భక్తులను సేకరించే  టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక PSG మణికంఠ, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి, భానుప్రకాష్ PSGలను విజిలెన్స్ వింగ్, 1 టౌన్ పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. 

Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన.

New Update
Nidadavole Police Station

Nidadavole Police Station

AP Crime News : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment