Elephants: మన్యంలో ఏనుగుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి...

ఉమ్మడి విజయనగరం..పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. పంటలు నష్టం చేస్తున్నాయి. కురుపాం మండలంలోని జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లిలలో గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

New Update
 Elephants Hulchul In Parvathipuram

Elephants Hulchul In Parvathipuram

Elephants :  ఉమ్మడి విజయనగరం..పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి..కురుపాం మండలంలోని గిరిశిఖర , జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి లలో గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గరుగుబిల్లి మండలంలోని ఒక ఏనుగుల గుంపు మిల్లులో చొరబడి బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే కురుపాం మండలం పట్టాయిగూడ గిరిజన గ్రామంలోనికి ఏనుగులు చొరబడటంతో గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఏ క్షణం తమపై ఏనుగులు దాడి చేస్తాయో అని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.

Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్

పార్వతిపురం జిల్లా కొమరాడ మండలం లో గత 15 రోజులు గా మాకం వేసిన ఏనుగులు.. స్థానికంగా ఉన్న కొబ్బరి, పామ్ ఆయిల్, కర్బూజా, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని పూతికవలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు గ్రామంలోని ఏగిరెడ్డి సింహాచలానికి చెందిన 3 ఎకరాల కర్బూజ, పామాయిల్‌ పంటలను నాశనం చేశాయి. అప్పులు చేసీ మరీ కర్భూజ పంటను సాగుచేశానని, దిగుబడి వచ్చిన సమయంలో ఏనుగులు పంటను ధ్వంసం చేయడం వల్ల సుమారు 3 లక్షల వరకు నష్టపోవాల్సివచ్చిందని, ప్రభుత్వాధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తున్న పంటలను ధ్వంసం చేస్తూ తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగులు ఇప్పుడు జనావాసాల్లోనికి రావడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ఏనుగులను తరలించి తమ పంటలను, ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మన్యం జిల్లాలో తరచూ ఈ ఏనుగుల గుంపులు వచ్చి పంటలు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి.. దీంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. మన్యం జిల్లాలో ఇప్పటికే ఏనుగుల బారినపడి 12 మంది వరకూ మృతి చెందారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నష్ట పరిహారం కూడా ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!


కుంకీ ఏనుగులు రప్పించి ఇక్కడి గజరాజుల సమస్య పరిష్కరిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. త్వరితగతిన ఆ హామీని నిలబెట్టుకోవాలని రైతులు కోరారు. నెలలు గడుస్తున్నా కుంకీల విషయంలో ఇప్పటికీ ఏ విధమైన ముందడుగు పడకపోవడంపై అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP New RationCards: మంత్రి నాదెండ్ల శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన!

పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తిచేసి అందిస్తామన్నారు.

New Update
ap rationcard

ap rationcard

AP New RationCards: పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. 

ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే..

ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్డులో కుటుంబసభ్యులను చేర్చుకోవడంతోపాటు తొలగించేందుకు కూడా ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని, నేటినుంచి దీపం-2 రెండోవిడత సిలిండర్‌ బుకింగ్‌ మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇప్పటికే వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు, కోటిన్నర కుటుంబాలకు 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం అందిస్తున్నామని, పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక నెల తీసుకోకపోయినా 3 నెల తీసుకునే అవకాశం కల్పించాం. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి. 

ration-cards | nadendla-manohar | cm-chandrababu | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment