/rtv/media/media_files/2025/03/17/F9RxOTagOng4J5RONJST.jpg)
CM Chandrababu Naidu taken Shocking decision to YSR district name change
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చారు. ఈ మేరకు కొత్త పేరును యాడ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న వైఎస్ఆర్ జిల్లాను ఇకపై వైఎస్ఆర్ కడపగా జిల్లా పేరు మార్చాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్రామ్ సంచలనం!
వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగగా.. అందులో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు యాడ్ చేస్తూ కెబినెట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి YSR జిల్లాను YSR కడప జిల్లాగా పరిగణించనున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాగానే దీనికి పేరు ఉండేది. కానీ గత టెర్మ్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ జిల్లా పేరులోని కడప తొలగించి.. వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే గతంలో రెండు పర్యాయాలు సీఎంగా YS రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఆయన 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణానంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం YS రాజశేఖరరెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా పేరును YSR కడప జిల్లాగా మార్చింది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. వైసీపీ అధినేత, వైఎస్ఆర్ తనయుడు జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా పేరును మార్చారు. అందులోని కడపను తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సోమవారం జరిగిన కేబినెట్లో వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. . . . .
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!