Bribe: లంచం కోసం బాధితురాలు తాళి తాకట్టుపెట్టిన ఎస్సై..

చిత్తూరు సోమల ఎస్సైగా పనిచేస్తున్న నరసింహులు లంచం కోసం ఓ బాధితురాలి తాళి తాకట్టుపెట్టించాడు. ఇది మాత్రమే కాదు అనేక కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నాతాధికారులు విచారణ జరపగా..

New Update
si Narasimhulu

Chittoor si Narasimhulu

ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. లంచం కోసం ఓ బాధితురాలి తాళి తాకట్టుపెట్టించాడు ఓ ఎస్సై. చిత్తూరు జిల్లా సోమల ఎస్సైగా పనిచేసిన పోలీస్ అధికారి నరసింహులు ఈ దారుణానికి  పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో నరసింహులు పై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈనెల 15న అతడిని సస్పెండ్ చేశారు. 

ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

తాళి తాకట్టు పెట్టించిన ఎస్సై 

అయితే 2023లో నరసింహులు ఎస్సైగా ఉన్న సమయంలో ఓ మహిళా కనిపించకుండాపోవడంతో ఆమె భర్త స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, మరుసటి రోజే ఆమె స్టేషన్ కి వచ్చి కుటుంబ గొడవల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు ఎస్సైకి తెలిపింది. దీంతో ఎస్సై నీ ఇష్టప్రకారం ఉండాలంటే రూ. లక్ష ఇవ్వాలని ఆమెను  డిమాండ్  చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పగా.. మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వమని సలహా ఇచ్చాడు. అనంతరం ఆమెను తెలిసిన వ్యాపారి దగ్గరకు పంపి.. ఆమె ఫోన్ పే నుంచి రూ.60 వేలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత విషయం బయటపడడంతో ఓ కానిస్టేబుల్ ద్వారా ఆమెకు తిరిగి డబ్బులు చెల్లించాడు. ఇది మాత్రమే కాదు అనేక కేసుల్లో  అవినీతికి పాల్పడినట్లు అతడిపై  ఆరోపణలు వచ్చాయి.

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

కమ్మపల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ జరగ్గా.. ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని యువరాజులు అనే వ్యక్తిని హత్యాయత్నం కేసులో ఇరికించడానికి  ఓ వర్గం నుంచి రూ.7 లక్షలు తీసుకున్నారు. అమెరికా వెళ్లాలని అనుకున్న ఆ యువకుడు కేసు నమోదు కావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. దీనిపై యువరాజులు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేయగా.. నరసింహులు పై విచారణ జరిపించారు. అలాగే  రూ.3 లక్షల విలువైన వెదురుకర్రలు దొంగిలించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసంటూ మూసేశారు. ఇలా వీటన్నింటిపై  ఉన్నాతాధికారులు విచారణ జరపగా..  నరసింహులు పై ఉన్న ఆరోపణలన్నీ వాస్తవాలేనని తేలడంతో సస్పెండ్‌ చేశారు. 

Also Read :  భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amzath Basha Brother Arrest in mumbai : మాజీ డిప్యూటీ సీఎంకు షాక్.. ముంబైలో తమ్ముడు అరెస్ట్..

అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.

New Update
Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai : అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. రేపు కడప కోర్టులో హాజరు పరచనున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులురెడ్డిని దూషించారనే ఫిర్యాదులతో పాటుగా ఓ స్థలం విషయంలో దాడి చేశారనే ఆరోపణలపై అహ్మద్ బాషా మీద కేసులు ఉన్నాయి. అహ్మద్ బాషాపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా కువైట్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు తెలిసింది. అహ్మద్ బాషాపై కడపలో కేసు నమోదైంది. వినాయకనగర్‌లోని ఓ స్థలం విషయంలో దాడిచేశారని ఫిర్యాదు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఈ కేసుతో పాటుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను అసభ్యకర పదజాలంతో దూషించారంటా అహ్మద్ బాషాపై కేసులు ఉన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో నేత శ్రీనివాసుల రెడ్డిపై పోలీసు స్టేషన్‌లోనే దాడి చేసేందుకు అహ్మద్ బాషా యత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడప పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. సోమవారం కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరు పరిచే అవకాశముంది.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

మరోవైపు పోలీస్ స్టేషన్‌ నుంచి తన అనుచరుణ్ని అంజాద్ బాషా బలవంతంగా తీసుకెళ్లడం శనివారం సంచలనం రేపింది. కడప పట్టణంలోని రాజారెడ్డి వీధి, బుడ్డాయపల్లెకు చెందిన కొంతమంది మహిళల వద్ద మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే అప్పు తీసుకుని 13 ఏళ్లు దాటినా తిరిగి చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన మహిళలు నిలదీయగా.. ఆ డబ్బులను ఇబ్రహీం మియా అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పారు. ఇబ్రహీం మియా కోసం మహిళలు గాలించగా పాత బస్టాండు వద్ద శుక్రవారం కనిపించాడు. దీంతో మహిళలు ఇబ్రహీం మియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కడప ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

అయితే ఇబ్రహీం మియా అంజాద్ బాషా అనుచరుడని తెలిసింది. దీంతో అంజాద్ బాషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇబ్రహీం మియాను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు.. అంజాద్‌ బాషా ఇంటికి వెళ్లి ధర్నాకు దిగారు. వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాల పైనా కేసులు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఇబ్రహీం మియా ఇచ్చిన ఫిర్యాదుతో మహిళలపై కేసు నమోదు చేశారు. అలాగే డబ్బులు ఇవ్వాలని అడిగితే అసభ్యకరంగా మాట్లాడాడని మహిళలు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీం మియాపైనా కేసు నమోదైంది.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

Advertisment
Advertisment
Advertisment