APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట

ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది.

New Update
APSRTC: కార్తీక మాసం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ!

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. స్పెషల్ సర్వీసులు, రాయతీలు బాగానే కలిసివచ్చాయి. ఫలితంగా.. ఏపీఎస్ ఆర్టీసీకి కోట్లల్లో లాభాలు వచ్చి పడ్డాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఏపీ ప్రజలకు పెద్ద పండుగ. ఎవరు ఎక్కడ స్థిరపడినా.. పండుగ వేళ స్వగ్రామానికి చేరుకుని.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతుంటారు. 

Also Read: పురుషుల్లో అధిక బరువు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం! పరిశోధనలో షాకింగ్ విషయాలు

ఇందు కోసం మూడు నెలల ముందు నుంచే ట్రైన్ టికెట్లు, బసు టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అయినా సరే చాలా మందికి టికెట్లు దొరకవంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ప్రయాణికులు సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపింది. పండుగ సందర్భంగా.. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు నడిపించగా.. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఏకంగా 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ. మరోవైపు.. పండుగ సెంటిమెంట్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుని.. ప్రయాణికులను నిలువు దోపిడీ చేశాయి. 

Also Read: AP Govt Jobs 2025: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త.. 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

వారికి 10 శాతం...

ఈ క్రమంలో.. సంక్రాంతి పండుగకు నడిపే బస్సుల్లో ప్రయాణీకులపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని సంస్థ ఎండీ ప్రకటించారు. అలాగే.. రానూపోనూ టికెట్లు ఒకేసారి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ కూడా కల్పించింది. దీంతో.. ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ని నమ్ముకోకుండా.. ఏపీఎస్ ఆర్టీసీ కే మొగ్గు చూపారు.

ఫలితంగా.. ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. దీంతో సంస్థకు కాసుల పంట పండింది. సంక్రాంతి పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటి వరకూ ఏపీఎస్ఆర్టీసీలో సంక్రాంతికి 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేశారు. 

దీంతో.. ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం రావటం గమనార్హం. సుమారుగా రూ.12.5 కోట్ల ఆదాయాన్ని ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఆశిస్తోంది. అయితే.. చాలా మంది ప్రయాణికులు ఇప్పటికీ ఊళ్లల్లోనే ఉండిపోయారు. చాలా మంది ప్రజలు.. వారాంతంలో  తిరుగు ప్రయాణాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మరింత ఆదాయం వస్తుందని ఏపీఎస్ఆర్టీసీ అనుకుంటుంది. గతేడాది.. రాను పోను కలిపి రూ.12 కోట్లు ఆదాయం ఆర్జించింగా.. గతేడాది 4.3 లక్షల మంది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేశారు. ఈసారి.. ఆ రికార్డు బ్రేక్ చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దంగా ఉంది.

Also Read: Saif Ali Khan: సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

Also Read: KTR: ముగిసిన ఈడీ విచారణ.. 7 గంటలు చెమటలు పట్టించిన అధికారులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు