Ap: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

New Update
rains

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలహీనపడింది.ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 24 నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Also Read: CPI: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ!

ఈ వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రైతులు, ప్రజలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సోమవారం విశాఖపట్నం,  కృష్ణా, గుంటూరు,అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా,  బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

Also Read: Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్‌ రైలులో మంటలు

అలాగే డిసెంబర్ 24వ తేదీ అంటే మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. . పంట పొలాల్లో నీరు నిలువ ఉండకుండా బయటకు వెళ్లేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Also Read: ఎన్డీయేలో చేరనున్న నేషనల్ కాన్ఫరెన్స్ !.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

మరోవైపు వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో పంటపొలాల్లోని రైతులు, గొర్రెలు, పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది. అలాగే వాగులు, వంకల సమీపానికి వెళ్లవద్దని జాగ్రత్తలు చెప్పింది. 

కల్వర్టులు, పాత నిర్మాణాల వద్దకు వెళ్లరాదని సూచించింది. మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ముందు జాగ్రత్తలు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment