AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోద ముద్ర

ఆంధ్రప్రదేశ్ మంత్రవర్గం డిసెంబర్ 3న సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ మీటింగ్ జరింగింది. 10 అంశాలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ బేటీ ఆమోదం తెలిపింది.

New Update
ap cabinet

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం డిసెంబర్ 3 (మంగళవారం) ఉదయం 11 గంటలకు సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ మీటింగ్ జరింగింది. జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యం జరిగిందని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీఆర్ స్తాయి దాటి పథకం ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు సీఎం. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని ఢిల్లీలోనూ చెప్పుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 

ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

మిషన్ మోడ్ లో పనిచేస్తే పథకం ప్రయోజనాల్ని వేగంగా ప్రజలకు అందించవచ్చని మంత్రి నారా లోకేష్ అన్నారు. పథకాలు ప్రజలకు చేరువైయేందుకు అధికారులు దష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 10 అంశాలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ బేటీ ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి : AP Crime: ఏపీలో విషాదం.. ప్రేమికులు ఆత్మహత్య

ముఖ్యంగా కాకినాడు పోర్ట్ విషయంలో మంత్రివర్గం చర్చించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్న సందర్భంగా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఏ పనులు జరిగాయో పూర్తి వివరాలు తనకు కావాలని సీఎం కోరారు. మద్యం, ఇసుక మాఫియాలను అరికట్టామని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి వర్గం అమోదం తెలిపిన అంశాలు

పీఎం ఆవాస్ యోజన గిరిజన గహ పథకం అమలు
2024-29 సమీకృత పర్యాటక పాలసీకి ఆమోద ముద్ర
2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులు
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం
పొట్టి శ్రీరాములు వర్థంతి డిసెంబర్ 15ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఐటీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 ఆమోదం
ఏపీ టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ
ఏపీ మారిటైమ్ పాలసీ
ఇది కూడా చూడండి: 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

ఇది కూడా చూడండి: భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment