Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్‌లో ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖ ఇచ్చారు.

New Update
Vijayasai Reddy resigns from Rajya Sabha membership

Vijayasai Reddy resigns from Rajya Sabha membership

Vijaysai Reddy

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిన్న (శుక్రవారం) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే ఇవాళ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్‌లో ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

ఏ రాజకీయ పార్టీలోనూ చేరను

కాగా తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడినన్నారు. జగన్‌కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!

 టీడీపీతో రాజకీయంగా విభేదించానని.. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందన్నారు. తన భవిష్యత్తు ఇక వ్యవసాయమే అని చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు