Janasena: వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని!

ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట అజయ్ దీనిపై అధికారిక లేక విడుదల చేశారు.

New Update
v babu

Sena party Varupula Tammaiya Babusu spended

Janasena: ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట అజయ్ దీనిపై అధికారిక లేక విడుదల చేశారు. ప్రత్తిపాడు సిహెచ్‌సి ఘటనపై అందిన నివేదికలు, వివరణలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రత్తిపాడు సిహెచ్‌సి వైద్యులు శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.

 

అసలేం జరిగిందంటే..

ఉమెన్స్ డే రోజను ప్రత్తిపాడు జనసేన ఇంఛార్జిగా ఉన్న వరుపుల తమ్మయ్య బాబు వీరంగం సృష్టించారు. ప్రత్తిపాడు పీహెచ్‌సీకి వెళ్లిన వరుపుల తమ్మయ్య బాబు మహిళా డాక్టర్, సిబ్బందితో దురుసుగా వ్యవహరించాడు. సీహెచ్‌సీ డాక్టర్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం చేస్తుండగా.. బాధితుల వివరాలు తమ్మయ్య బాబుకు చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు డాక్టర్‌కు ఫోన్ ఇచ్చేందుకు ట్రై చేశారు. 

Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

దీంతో వైద్యం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడనని ఆమె తిరస్కరించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న తమ్మయ్యబాబు.. తాను ఫోన్ చేస్తే మాట్లాడవా అంటూ లేడీ డాక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నోర్ముయ్ అంటూలేడీ డాక్టర్‌తో పాటుగా అక్కడ ఉన్న వైద్య సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై పవన్ సీరియస్ అయినట్లు సమాచారం. 

Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment