Ap Inter Exams: మరో గంటలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం.. ఎంతమంది హాజరవుతున్నారంటే!

ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు.

New Update
Ap Intermediate Exams Begin Today

Ap Intermediate Exams Begin Today

ఏపీలో నేటి నుంచి (మార్చి 1) ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఉదయం 8.30 గం.ల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

ఇవాళ మొదటిరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి పరీక్ష జరగనుంది. వారు సెకండ్ లాంగ్వేజ్‌పై పరీక్ష రాయనున్నారు. ఈ ఇంటర్మీడియట్‌ పరీక్షలు.. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఒక రోజు తప్పించి మరో రోజు జరగనున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

10.58 లక్షల మంది విద్యార్థులు

ఎక్కడా విద్యార్థులకు ఆటంకం కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. వాటిని ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల ఆఫీసులకు అటాచ్ చేశారు. మరోవైపు ఈ పరీక్షలను దాదాపు 10.58 లక్షల మంది విద్యార్థులు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

ఇక అధికారులు కొన్ని వస్తువులను అనుమతి చేయబోమని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కేవలం చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రం ఒక కీప్యాడ్ ఫోన్‌ను ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసింది.

అది కూడా కేవలం అధికారిక సమాచారం కోసం మాత్రమే అని తెలిపింది. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. లోపలికి పంపేంచేది లేదని అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. . .

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment