Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. బదిలీల షెడ్యూల్ ఖరారు!

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురాగా మే 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను భర్తీ చేయనుంది. 

New Update
DSC Posts

AP government key decision on government teachers transfers

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మే 30 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.  ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను  భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 

GO-117 రద్దు..

ఈ మేరకు ఈ చట్టం ప్రకారం మొదటిసారి బదిలీలు చేయనుండగా GO-117ను రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి తీసుకురాబోతున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానంలో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయనున్నారు. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా.. 1-5 తరగతులకు 5గురు టీచర్లను  కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95% పూర్తి చేయగా.. 430 బడులకు సంబంధించి ఫనల్ చేయాల్సివుంది.  వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసి మే 30 వరకు బదిలీల అంశాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. అలాగే సీనియారిటీ టీచర్ల జాబితాను ఏప్రిల్ 20వరకు సే పూర్తి చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక బదీలల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక టీచర్‌ ఎన్ని ఆప్షన్స్ అయినా ఎంచుకోవచ్చు.  సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయించనున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలలో మళ్లీ పనిచేసే అవకాశం ఉండదు. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకున్నవారు నచ్చిన పాఠశాలను ఎంచుకోవచ్చు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులుంటాయి. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించనున్నారు. చివరిగా SGTలకు బదిలీలు నిర్వహిస్తారు.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 transfer | cm-chandrababu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment