/rtv/media/media_files/2025/03/12/duReWHuf4TCkLGAZfpUn.jpg)
ap eap set 2025 notification released application started from march 15
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAP Cet 2025 నోటిఫికేషన్ను JNTU కాకినాడ రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తారు.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
ఈ AP EAPCET 2025కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ మార్చి 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్హత, ఆసక్తిగత స్టూడెంట్స్ ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు.. 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే.. సింగిల్ పేపర్కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.. ఇతర అభ్యర్థులకు రూ.900 ఫీజుగా నిర్ణయించారు.
Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
అదే సమయంలో రెండు పేపర్లకు అప్లై చేసుకోవాలంటే ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 1000 ఫీజు.. మిగిలిన అభ్యర్థులు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం ఈ సెట్ను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!