Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్‌ డెక్కర్‌ నే

ఏపీలో మైట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి..కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

New Update
Hyderabad metro Timings

Hyderabad metro Timings

Ap: ఏపీలో నిర్మించనున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టుల పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. అయితే విజయవాడ, వైజాగ్ నగరాల్లో పలు ప్రాంతాల్లో రోడ్డు ఉన్న చోట డబుల్ డెక్కర్ మెట్రో ఏర్పాటు చేసే అంశంపైనా ఈ మీటింగ్‌ లో చర్చలు జరిపారు. 

Also Read: Ganja: అనకాపల్లి To రాజస్థాన్.. భారీగా పట్టుబడ్డ గంజాయి!

కోల్‌కతాలో నిర్మించినట్లు ఏపీలోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి మెట్రో ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునే  విధానం అమలులో లేకపోయినప్పటికీ 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తోందని సీఎం  తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుకు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లించినట్లు పేర్కొన్నారు. 

Also Read: Andhra tourist killed: గోవా హోటల్‌లో ఘోరం.. ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి కొట్టి, ఆఖరికి!

కోల్‌కతా తరహాలోనే..

రూ.8,565 కోట్లతో కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించినట్లు వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు సంయుక్తంగా కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాయని తెలిపారు. ఇప్పుడు కోల్‌కతా తరహాలోనే ఏపీలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంలోని మోదీ సర్కార్‌తో చర్చలు జరపాలని సీఎం అన్నారు.ఇక ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి మెట్రో ప్రాజెక్టు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం అయినా.. లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

Also Read: Tirupati: తిరుమలలో పుష్పరాజ్‌ల హల్‌చల్.. భారీగా పట్టుబడ్డ దుంగలు!

ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇక విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నట్లు సీఎం అన్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విధానంలో కింద రోడ్డు దాని పైన ఫ్లై ఓవర్.. ఆపైన మెట్రో రైలు వస్తుందని వివరించారు.విశాఖలో మొదటి దశలో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్ల మార్గంలో గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల పాటు డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో రైలు నిర్మాణం జరగనున్నట్లు తెలిపారు. 

Also Read: Pawan: ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవండి.. విజయవాడ బుక్ ఫెయిర్‌లో పవన్

ఇక విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.ఇప్పటికే ఈ తరహా డబుల్ డెక్కర్ మెట్రో రైలు మోడళ్లు వివిధ నగరాల్లో పరుగులు తీస్తున్నాయని సీఎం చెప్పారు. అందుకే ఏపీలో కూడా ఇలాంటి తరహా మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

రానున్న 4 ఏళ్లలో విజయవాడ, విశాఖ రెండు నగరాల్లో ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేయాలని అధికారుల కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment