AP: తిరుమలకు ఏపీ సీఎం కుటుంబం..అన్నప్రసాదం వడ్డన

మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్స్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తిరుమలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాల్ని వడ్డించనున్నారు. 

New Update
ap

CM Chandra Babu Family

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి ఈరోజు, రేపు తిరుమల పర్యటనకు వెళ్ళనున్నారు. ఈరోజు రాత్రి 10.30 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని రేపు ఉదయం 8 గంటలకు దర్శన చేసుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దగ్గరుండి చూసుకుంటారు. అలాగే దర్శనం తర్వాత కుటుంబ సభ్యలతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని...అక్కడి భక్తులకు స్వయంగా తన చేతులతో అన్న ప్రసాదాలను వడ్డించనున్నారు ఏపీ సీఎం. 

దేవాన్ష్ పుట్టినరోజు ఆనవాయితీ..

ప్రతీ ఏడాది మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజున లేదా ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సీఎం చంద్రబాబు నాయుడు కుటంబానికి అలవాటు. ఈ ఏడాది కూడా దానిని పురస్కరించుకునే తిరుమలకు వస్తున్నారు. ఇక  నారా దేవాన్ష్ పుట్టినరోజు నాడు (మార్చి 21) అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు రూ.44 లక్షలను సీఎం భరించనున్నారు. రూ. 44 లక్షలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. 

Also Read: IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment