Liquor Door Delivery: ఏపీలో వైన్ డోర్ డెలివరీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు

ఏపీలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో చిన్న వ్యాన్‌లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Wine door delivery

Wine door delivery Photograph: (Wine door delivery)

Liquor Door Delivery: ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల బీర్(Beer) ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. అయితే తాజాగా ఏపీలో లిక్కర్ డోర్ డెలివరీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు ఇంటింటికి వెళ్లి మద్యం డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు..

కుక్కునూరు మండలం బయ్యనగూడానికి చెందిన వ్యక్తి ఏలూరు జిల్లాలో మద్యం హోం డెలివరీ చేస్తున్నాడు. జంగారెడ్డిగూడెం నుంచి మద్యం సీసాలు తీసుకొచ్చి గ్రామాల్లో వీటిని అమ్ముతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment