/rtv/media/media_files/2025/04/14/kErmcis5MzacHnZxrPBd.jpg)
cm cbn Photograph: (cm cbn )
AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
"ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది" అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దాం.… pic.twitter.com/H8OIAmH9MO
— N Chandrababu Naidu (@ncbn) April 14, 2025
దళితాభ్యుదయానికి పునరంకితం..
'ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది' అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దాం. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా... ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందాం. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం' అని కోరారు.
బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తాం, ప్రతీ వర్గానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను - @PawanKalyan#AmbedkarJayanti pic.twitter.com/z4Hz2ViQoW
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) April 14, 2025
అంబేడ్కర్కు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో… pic.twitter.com/7dwXK6NUpH
— Lokesh Nara (@naralokesh) April 14, 2025
భారతీయ సమాజానికి అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేడ్కర్ కృషి అమోఘం. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని లోకేశ్ పిలుపునిచ్చారు.
cm-chandrababu | telugu-news | today telugu news