AP budget: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!

ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖకు రూ.11636 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు కేటాయించారు.

New Update
ap budget  2123

ap budget 2123 Photograph: (ap budget 2123)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో సూపర్ సిక్స్ పథకాలకు భారీగా కేటాయింపులు చేసింది. అన్నదాత సుఖీభవ కోసం రూ.6300 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం రూ.9407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మండలిలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్, మే మాసాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ క్రమంలోనే విద్యా, వ్యవసాయ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకు రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిచనున్నారు.

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల 359 కోట్లు కాగా.. వ్యవసాయానికి ప్రత్యేకంగా రూ.48 వేల కోట్ల బడ్జెట్ ప్రకటించింది. రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్‌ ల లబ్ధిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు 11636 కోట్లు కేటాయించింది. పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు. 

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

అన్నదాత సుఖీభవ..

కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా స్కీమ్ లు అమల్లోకి రానున్నాయి. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు 20వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారాయన. రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిధ్ధంగా ఉందన్నారు చంద్రబాబు. త్వరలో అన్నదాత సుఖీభవ అమలు చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం అందించే 6వేలతో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Kiss Video: ఛీ ఛీ.. లైవ్‌లో ముద్దులతో రెచ్చిపోయిన అఘోరీ-శ్రీవర్షిణి.. కారులో రచ్చ రచ్చ

అఘోరీ - శ్రీవర్షిణి కారులో రెచ్చిపోయారు. లైవ్‌లో ఉండగానే ముద్దులతో రచ్చ రచ్చ చేశారు. వర్షిణి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెవల్ల తన లైఫ్ టర్న్ అయిపోయిందని అఘోరీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వర్షిణి బుగ్గపై ముద్దు పెడుతూ ఐలవ్ యు చెప్పింది.

New Update

అఘోరీ-శ్రీవర్షిణి తమ కార్‌లో ముద్దులతో రెచ్చిపోయారు. వర్షిణి తనకు దొరికిన మేలిమి బంగారమని తెగ పొగేడిసింది అఘోరీ. ఈ మేరకు వర్షిణిని పొగుడుతూ ముద్దులతో రచ్చ రచ్చ చేసింది. ‘‘వర్షిణి చాలా మంచిది. తను నాకు దొరికిన వజ్రం. నా లైఫ్ ఆమె వల్ల ఫుల్ టర్న్ అయిపోయింది. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

సభ్యసమాజం ఎలా ఉంటుంది.. ఎలా మాట్లాడతారు అనేది మొత్తం నేర్పించింది వర్షిణి. అందువల్లనే జీవితంలో వర్షిణి నేను ఇలాగే హ్యాపీగా ఉంటాం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. లవ్ యు చిన్నూ. జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాం. ఎవరెన్ని మాట్లాలు అన్నా.. ఎవరెంత బురద చల్లినా.. నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగానే ఉందాం.’’ అంటూ వర్షిణి బుగ్గపై ముద్దు పెట్టి రచ్చ రచ్చ చేసింది.

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

ముద్దులతో రచ్చ రచ్చ

దానిపై వర్షిణి కూడా నవ్వుతూ థాంక్యూ అంటూ చెప్పడం చూడవచ్చు. అంతేకాకుండా వర్షిణి తనను బావా అని పిలుస్తుంది అని అఘోరీ చెప్పుకొచ్చింది.  ఆశ్రమం కట్టడానికి ప్రయత్నిస్తున్నామని.. అది పూర్తయ్యాక త్వరలో తమ పేరెంట్స్, వర్షిణీ పెరెంట్స్‌ను తీసుకుని వెళ్లిపోతామని తెలిపారు.

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

తమ ఆశ్రమంలో అన్ని సమస్యలు ఎదుర్కొన్న వారికి చోటు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకునే వారికి చోటు కల్పిస్తామని అన్నారు. ఏది ఏమైనా అఘోరీ, శ్రీవర్షిణి ముద్దులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

aghori sri varshini | Aghori Sri Varshini Lov | sri varshini | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment