Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి.

New Update
AP CM Jagan London Tour: ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు పర్మిషన్.. వచ్చే నెల 2న విదేశాలకు జగన్

Andhra Pradesh government Good News for Tenant Farmers: ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి. కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవాదాయ, అటవీ భూముల సాగుదారులకు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మూడు విడతలుగా రూ.13,500 పెట్టుబడి సాయం అందజేస్తున్నారు.

సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతో కౌలు కార్డులు:

ఆంధ్ర ప్రదేశ్ లో కౌలు రౌతులకు కౌలు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సీసీఆర్సీ మేళాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహిస్తూ.. ప్రతి కౌలు రైతుకు రుణంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశ్యంతో పంటల సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కౌలు రైతులకు 100% పంట రుణాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఆర్బీకేలతో అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే.

7.77 లక్షల మందికి ప్రభుత్వం అద్దె కార్డులు జారీ చేసింది:

ఆర్బీకేల ద్వారా ఈ ఏడాది దాదాపు 7.77 లక్షల మందికి ప్రభుత్వం అద్దె కార్డులు జారీ అయ్యాయి. అన్ని వివరాలు రైతు భరోసా పోర్టల్‌ లో ఉన్నాయి. కానీ ముందుగానే ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ ఏడాది కౌలు రైతులకు రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కౌలు రైతులకు కౌలు కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి కౌలు రైతుకు పంట రుణాలతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని అందజేయాలన్నారు.

కౌలు రైతులు హర్షం:

ఈ నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది లక్షల మంది కౌలు దారులకు రూ. 6,668.64 కోట్ల పంట రుణాలు అందించగా, వైస్సార్ రైతు భరోసా కింద 3.92 లక్షల మంది కౌలు దారులకు రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. అలాగే 2.34 లక్షల మంది కౌలు రైతులకు రూ.246.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందించింది. 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల పంట బీమా పరిహారం ఉచితంగా అందించింది. ప్రభుత్వం రైతు భరోసా ఖాతాల్లో జమ చేయనుండడంతో కౌలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం

వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!!

Advertisment
Advertisment
తాజా కథనాలు