Andhra Pradesh : జులై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రానున్న జగన్‌

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మాజీ సీఎం జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వస్తారని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు.

New Update
Andhra Pradesh : జులై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రానున్న జగన్‌

AP Assembly Meetings : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మాజీ సీఎం జగన్‌ (Ex. CM Jagan) హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన వస్తారని మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) స్పష్టం చేశారు. జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు వస్తారని.. ప్రభుత్వాన్ని నిలదీస్తారని పేర్కొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు.

Also read: గుడివాడలో కొడాలి నానికి బిగ్ షాక్.. ఆఫీసు స్వాధీనం!

ఇదిలాఉండగా.. వైసీపీ (YCP) కి 11 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే రానున్నారు. అయితే చర్చల్లో పాల్గొనేందుకు జగన్‌కు తగినంత సమయం లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే అసెంబ్లీలో ఆయన వ్యూహాం ఏంటి.. ఎలాంటి అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారే దానిపై ఆసక్తి నెలకొంది.

Also read: కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు నిందితులు అరెస్ట్..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు.

New Update
Tenth results

Tenth results

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. 


100 శాతం ఫలితాలు సాధించిన 1680 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇందులో అబ్బాయిలు 78.31 శాతం పాస్ కాగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం వెబ్‌సైట్ మాత్రమే కాకుండా వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసినా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment