Anant Ambani Pre Wedding: అంబానీ ఇంట వేడుక.. టాలీవుడ్ నుంచి గేమ్ ఛేంజర్!

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈరోజు అంటే మార్చి1 సాయంత్రం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు జరిగే  ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు పాల్గొంటున్నారు. 

New Update
Anant Ambani Pre Wedding: అంబానీ ఇంట వేడుక.. టాలీవుడ్ నుంచి గేమ్ ఛేంజర్!

Anant Ambani Pre Wedding: ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈరోజు అంటే మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. గుజరాత్ లోని (Gujarat) జామ్ నగర్ లో జరగనున్న ఈ  సెలబ్రేషన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ, క్రీడా కారులు హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan) హాజరుకానున్నారు. ఈ వివాహ వేడుకలో తన భార్య ఉపాసనతో కలిసి ఈయన పాల్గొననున్నారు. రామ్‌చరణ్ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన భార్యాపిల్లలతో కలిసి సందడి చేయనున్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కరే ఈ వేడుకలకు వెళుతున్నారు. 

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ హాజరు కానున్నారు. భారతదేశంలోని కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను (Radhika Merchant) వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ మరియు క్రీడా తారలు హాజరయ్యారు. మూడు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి.

 ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులు జామ్ నగర్ కు వస్తున్నారు. వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి ఈ ఉదయం జామ్‌నగర్ చేరుకున్నారు. ఇక రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, షారుఖ్ ఖాన్ కుటుంబం, అర్జున్ కపూర్, అలియా భట్-రణబీర్ కపూర్ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు ఇప్పటికే బాలీవుడ్ నుండి వచ్చారు. పాప్ సింగర్ రిహన్నా కూడా జామ్ నగర్ వచ్చారు. 

Also Read: ప్రభాస్ తో ఆయన.. మొదటిసారిగా.. కల్కి నుంచి సూపర్ అప్ డేట్!

ప్రీ వెడ్డింగ్ వేడుక సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంత్ - రాధిక జనవరి 2023లో ముంబైలోని అంబానీ నివాసంలో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలైలో ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు శంకర్ మార్కు సందేశ ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ డిసెంబర్‌లో విడుదల కావచ్చని అంటున్నారు. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొంటున్న వారిని ఇక్కడ చూసేయండి: 

Advertisment
Advertisment
తాజా కథనాలు