West Bengal: జూనియర్‌ డాక్టర్‌ శరీరంలో అధిక వీర్యం.. వెలుగులోకి సంచలన నిజాలు

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. ఒక్కరు హత్యాచారం చేస్తే ఇది సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు.

New Update
West Bengal: జూనియర్‌ డాక్టర్‌ శరీరంలో అధిక వీర్యం.. వెలుగులోకి సంచలన నిజాలు

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

Also Read: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం

మృతిరాలి రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయ్యిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, కడుపు, చేతి వెళ్లపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. ఆమెపై పాశవికంగా దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు గుర్తించారు. కూతురు మృతిపై ఆమె తల్లిదండ్రులు.. కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కూతురిపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేసి ఉంటారని ఆరోపించారు. వైద్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆ మోతాదు కేవలం ఒక్క వ్యక్తికి సాధ్యం కాదని.. ఎక్కువ మంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు ఆస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం చూసేసరికి ఆస్పత్రి సెమినార్ హాల్‌లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది. దీంతో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే మృతిరాలికి పోస్టుమార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి.

Also Read: ఇంటర్ అర్హతతో రైల్వేలో 11,250 ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime: ఎంతకి తెగించావ్‌ రా.. తుపాకీ గురిపెట్టి దళిత మహిళపై రేప్‌

యూపీలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మెయిన్‌పురి జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. చివరికి బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

అయితే ఆ దళిత మహిళ భర్త తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. దీన్ని ఆ నిందితుడు ఆసరాగా చేసుకున్నాడు. అతని భార్యకు రూ.20 వేలు అప్పుగా ఇస్తానని నమ్మించాడు. ఓ బ్రిడ్జి వద్ద తన కొడుకుతో ఆమె ఉంది. దీంతో మోటార్‌ బైక్‌పై ఆ నిందితుడు వచ్చాడు. వాళ్లిద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

అక్కడ ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తుపాకీతో బెదిరించి మరీ ఆమెను రేప్ చేశాడు. ఎదురు తిరిగితే తుపాకీతో కాల్చేస్తానంటూ ఇద్దరిని బెదిరించాడు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో వాళ్లు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యుల బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.    

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

rtv-news | rape | Uttar Pradesh 

Advertisment
Advertisment
Advertisment