అమెజాన్ లో మరోసారి లే ఆఫ్స్‌..ఈసారి ఎంతమందంటే?

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మరోసారి లే ఆఫ్‌ ప్రకటించింది. తన గేమింగ్‌ డివిజన్‌ నుంచి సుమారు 180 మంది ఉద్యోగులను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
Amazon Mega Electronics Days Sale: అమెజాన్లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్.. ఈ వస్తువులపై ఊహించని డిస్కౌంట్లు!

అమెజాన్ మరోసారి తన ఉద్యోగులను తొలగించింది. కరోనా తరువాత ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే అమెజాన్‌ పలుమార్లు తన కంపెనీ ఉద్యోగులను తొలగించింది. ఈ క్రమంలోనే మరోసారి అమెజాన్‌ తన కంపెనీ ఉద్యోగులకు బైబై చెప్పింది.

తన గేమింగ్‌ డివిజన్‌ నుంచి సుమారు 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి నవంబర్‌ 13న అధికారిక మెయిల్‌ పంపింది. ఈ విషయం గురించి అమెజాన్‌ గేమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టోఫ్‌ హార్ట్‌మన్‌ దీని గురించి వివరించారు. మా వ్యాపారాన్ని ముందుకు నడిపించడం కోసమే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మా కస్టమర్లకు ఏం కావాలో మాకు తెలుసు. వారు మా వద్ద నుంచి ఎప్పుడూ కూడా ఎక్కువగా కోరుకుంటున్నారు.

అందుకే మా సంస్థను మరింత మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సోమవారం నుంచి అమెజాన్‌ తన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.అమెజాన్‌ నుంచి ఈ ఏడాది ఇది రెండో లే ఆఫ్‌ రౌండ్‌. గత వారంలో కూడా కొంత మంది ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇక గ‌త ఏడాది ఆర్ధిక మాంద్య భ‌యాలు, మంద‌గ‌మ‌నం వెంటాడ‌టంతో అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది.ఇక గ‌త ఏడాది ఆర్ధిక మాంద్య భ‌యాలు, మంద‌గ‌మ‌నం వెంటాడ‌టంతో అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది.

Also read: చచ్చేంత వరకు జగన్‌ వెంటే: అంబటి రాంబాబు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

దేశంలో మరోసారి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో కస్టమర్లతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

New Update
upi transactions

upi transactions

UPI Transactions:

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

Advertisment
Advertisment
Advertisment