Rohit Sharma Somnath: రోహిత్‌ శర్మ, ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్‌ ఏంటో తెలుసా?

తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే విక్టరీ గ్యారెంటీనా? ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ చర్చే జరుగుతోంది. ఇస్రో చీఫ్‌ సోమనాధ్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఇద్దరూ వెంకన్నని దర్శించుకున్న తర్వాత అద్భుత ప్రదర్శన చేశారని నెటిజన్లు అంటున్నారు. 2019 ప్రపంచకప్‌కి ముందు రోహిత్‌ తిరమలకు వచ్చాడని.. ఆ టోర్నిలో 5 సెంచరీలు బాదాడని.. ఇటు ఇస్రో చీఫ్‌ కూడా శ్రీవారి ఆశీర్వాదం తర్వాత చంద్రయాన్‌-3 సక్సెస్‌ని పొందారని అంటున్నారు.

New Update
Rohit Sharma Somnath: రోహిత్‌ శర్మ, ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్‌ ఏంటో తెలుసా?

Rohit Sharma and Somnath: జాబిల్లిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సక్సెస్‌ గురించి రోజులు గడుస్తున్నా సోషల్‌మీడియాలో చర్చ మాత్రం ఆగడంలేదు. ఇక ల్యాండర్‌ నుంచి దిగిన రోవర్‌ పరుగులు పెడుతోంది.. చంద్రుడిపై రహస్యాలను తెలుసుకుంటూ ఫొటోలు పంపుతోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయం వెనుక అనేక మంది పాత్ర ఉండగా.. ఈ సక్సెస్‌లో ప్రధాన రోల్‌ మాత్రం ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌దే. ప్రయోగాన్ని ముందుండి నడిపించారు సోమనాథ్‌. అన్నితానై చూసుకున్నారు. అందుకే ఫస్ట్ క్రెడిట్ ఆయనకే దక్కింది. అటు ఇంటర్‌నెట్‌ ప్రపంచం మొత్తం చంద్రయాన్‌ న్యూస్‌తో నిండిపోయి ఉండగా.. సోషల్‌మీడియాలో భారతీయులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్‌ శర్మకి ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కి ఉన్న ఓ కనెక్షన్‌ గురించి తెగ చర్చ జరుగుతోంది.

తిరుమల వెంకన్న లింక్:
ఏదైనా పని చేసేముందు చాలా మంది దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారు. వీరిలో స్కూల్‌ విద్యార్థుల నుంచి దేశాన్ని నడిపించే నాయకులు ఉంటారు. అటు డాక్టర్లు, సైంటిస్టులు, క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ప్రయోగానికి ముందు దేవుడి గుడిని దర్శించుకుంటారు. అందులోనూ తిరుమల శ్రీవారిని (Tirumala Temple) ఎక్కువగా దర్శించుకుంటారు. చంద్రయాన-3 ప్రయోగానికి ముందు సోమనాథ్‌ (Somanath)కూడా అదే చేశారు. వెంకన్నను దర్శించుకున్నారు. ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్న హైలెట్ చేస్తూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు.

రోహిత్‌ శర్మ కూడా అలానే చేశాడుగా:
2019 ప్రపంచ కప్‌కి ముందు రోహిత్‌ శర్మ తన భార్య రితికతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆ టోర్నిలో రోహిత్‌ అరవీర భయాంకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ ఆట చూసి ప్రపంచ క్రికెట్‌ అభిమానులు అతనికి జేజేలు పలికారు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 647 పరుగులు చేశాడు హిట్‌మ్యాన్‌. సగటు 107.83. స్ట్రైక్ రేట్ 98.9గా ఉంది. ఏకంగా ఒక్క ప్రపంచకప్‌లోనే రోహిత్ శర్మ 5 సెంచరీలు చేశాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇక్కడ కూడా అంతే.. మరి నెక్ట్స్‌ ఏంటి?
ఇస్రో చీఫ్ సోమనాథ్ కూడా చంద్రయాన్ ప్రయోగానికి ఒక రోజు ముందు తన బృందంతో తిరుపతి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత సోమనాథ్ బృందం చేసిన అద్భుతమైన ప్రయోగం గురించి ప్రపంచం ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంది. రోహిత్ శర్మ, సోమనాథ్ ఇద్దరూ తిరుపతి ఆలయంలో పూజలు చేశారు. ఇక ఈ వరల్డ్‌కప్‌కి ముందు కూడా హిట్‌మ్యాన్‌ తిరుమల వెంకన్నని దర్శించుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియాకు అతడే కెప్టెన్‌.. ఇటు సోమనాథ్‌ కూడా ఇస్రో టీమ్‌కి లీడర్‌.. చంద్రయాన్ సక్సెస్‌ లాగానే టీమిండియా ఈసారి వరల్డ్‌కప్‌ కొడుతుందని ఫ్యాన్స్‌ లాజిక్‌లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్ని అభిమానులు అనుకుంటున్న మాటలేనని గమనించగలరు.

ALSO READ: చంద్రయాన్‌-3 బాడీ పెయింటింగ్‌ ఫొటోలు వైరల్‌.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

ఐపీఎల్ సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఇంటికి వెళ్ళిపోయినట్లే. హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. దీనిపై కెప్టెన్ తలా ధోనీనే నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఎవరూ ఆడకపోతే తానేం చేయాలి అంటూ బాధను వెళ్ళగక్కారు.

New Update
Dhoni IPL retirement

Dhoni IPL retirement

ఒకటి, రెండు ప్రాబ్లెమ్స్ అయితే సరిదిద్దుకోవచ్చును. చిన్న ప్లేయర్లు అయితే నేర్పించవచ్చును. కానీ ఆటగాళ్ళు పెద్ద వాళ్ళు అయి ఉండి...ఎక్కువ మంది ఆడకపోతే ఏం చేయగలము అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల కొట్టుకుంటున్నాడు. చెన్నై ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌ల్లో 19 మంది ఆటగాళ్లను ఆడించింది. రకరకాల కాంబినేషన్స్ కూడా ట్రై చేశాను. ఇంత చేసినా ఎవరూ ఆడలేదు.  ఉన్నవాళ్ళందరూ ఆడకపోతే ఎక్కువ మార్పులు చేయాల్సి వచ్చిందని ధోనీ చెప్పాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను బ్యాటర్లు ప్రతీసారి అటాక్ చేయలేకపోయారు. ఎంత చెప్పినా ఆడలేదు. మా ఓటమికి ప్రధాన కరణాల్లో అది కూడా ఒకటని ధోనీ చెప్పుకొచ్చాడు. 

ఇప్పటివరకు అతి చెత్త ప్రదర్శన..

ఐపీఎల్ 18 సీజన్ లో చెన్నై అతి పేలవమైన ప్రదర్శన చేసింది.  మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడింది. అందులో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చాలా కీలకమైన మ్యాచ్ లలో చెత్త ప్రదర్శన ఇచ్చింది. కనీసం రన్ రేట్ ను కూడా మెయింటెయిన్ చేయలేకపోయింది. కెప్టెన్ మార్చారు, ప్లేయర్లను మర్చారు కానీ ఫలితం లేకపోయింది. ప్రతీ మ్యాచ్ లోనూ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిజానికి కెప్టెన్ ధోనీ కూడా పెద్దగా ఆడింది లేదు. కానీ చెన్నై జట్టుకు మళ్ళీ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాక కాస్త బాగానే ఆడాడు. చివర్లో వచ్చినా మెరుపులు మెరిపించడంలో సఫలం అయ్యాడు. కానీ అతని కన్నా ముందు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో మ్యాచ్ లు ఓడిపోయారు.  

today-latest-news-in-telugu | csk | IPL 2025 | mahendra-singh-dhoni 

Also Read: UP: పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

Advertisment
Advertisment
Advertisment