Pawan Kalyan: ఈనెల 20 తర్వాత అందరినీ కలుస్తా..జనసేనాని

జిల్లాల వారీగా అందరినీ త్వరలోనే కలుప్తానని చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ నెల 20తర్వాత పిఠాపురంలో పర్యటిస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

New Update
Pawan Kalyan : జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

Janasena Chief Pawan Kalyan: పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని అననారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు, వీర మహిళలు, ఉద్యోగులు అందరూ తనకు అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. చాలాచోట్ల జనసైనికులు, వీర మహిళలు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. వారందరినీ త్వరలోనే కలుస్తానని మాట ఇచ్చారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉందని..అదీ కాకుండా శాసనసభ సమావేశాలు కూడా మొదలవనున్నాయి. వీటిని పూర్తి చేసుకుని తాను జిల్లాల వారీగా పర్యటిస్తానని చెప్పారు. మొదట తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని... ఈనెల 20వ తేదీ తర్వాత అక్కడి కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని తెలిపారు. ఆ తర్వాత గ్రామాలు, నియోజకవర్గాల వారీగా తిరుగుతానని అన్నారు.

నన్ను నేరుగా కలవాలని కార్యకర్తలు, నాయకులు ఆశిస్తున్నారని...తాను కూడా వారందరినీ కలవాలని, మాట్లాడాలని అనుకుంటున్నానని అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ముందుగానే తెలియజేస్తానని అన్నారు. తనకు అభినందనలు చెప్పడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read:Visa: విద్యార్ధి వీసాల ప్రక్రియ మొదలుపెట్టిన అమెరికా..గతేడాది కంటే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూషను హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది.

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment