TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు!

ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే యూనివర్సీటిల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. మొత్తం పోస్టులు 2,825 ఉండగా 1,977 ఖాళీలున్నట్లు సమాచారం.

New Update
Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు?

Revanth Sarkar : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీల భర్తిపై రేవంత్(CM Revanth) సర్కార్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలు, ఇందుకు సంబంధించిన ఖాళీల భర్తీపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా యూనివర్సిటీల్లో అధికారులు టీచింగ్‌(Teaching), నాన్‌ టీచింగ్‌(Non Teaching) పోస్టుల ఖాళీల వివరాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఆచరణలోకి రాని జీవో..
ఈ మేరకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి 2,825 టీచింగ్‌ పోస్టులు ఉన్నాయని, ఇందులో ప్రస్తుతం 848 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక నాన్‌ టీచింగ్‌ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉండగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పోస్టులను భర్తీ చేయలేదు. 1,061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల(Assistant Professors) పోస్టుల భర్తీకి 2017లో జీవో నంబరు-34ను జారీ చేసినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. యూనివర్సిటీల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు నియామక బోర్డును ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. కానీ ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదించకపోవడంతో పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో మరోసారి ఈ నియామకాలపై సందిగ్ధత నెలకొంది.

ఇది కూడా చదవండి : Vijay Sethupathi : ‘హిందీ రుద్దుడు..’ రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం!

20 వేల ఉద్యోగాలు..
అయితే ఇటీవలే యూనివర్సిటీల అభివృద్ధి కోసం, ఖాళీల భర్తీ కోసం చర్యలను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనుండగా ఈ ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉండాల్సి టీచింగ్ పోస్టులు, ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు, ఖాళీలు:

1. ఉస్మానియా: టీచింగ్ పోస్టులు-1267. ఖాళీల సంఖ్య- 891
2. కాకతీయ: పోస్టులు- 409, ఖాళీలు- 323.
3. జేఎన్ టీయూహెచ్: పోస్టులు- 409, ఖాళీలు- 323.
4. అంబేడ్కర్: పోస్టులు- 86, ఖాళీలు- 52.
5. తెలంగాణ: పోస్టులు-152, ఖాళీలు- 91.
6. జేఎన్ ఎన్ ఏఎఫ్ యూ: పోస్టులు- 55, ఖాళీలు 38.
7. పొట్టి శ్రీరాములు: పోస్టులు- 72, ఖాళీలు 58.
8. మహాత్మగాంధీ: పోస్టులు- 70, ఖాళీలు- 35.
9. పాలమూరు: పోస్టులు- 95, ఖాళీలు 74.
10. శాతవాహన: పోస్టులు- 63, ఖాళీలు 47.
11. ట్రిపుల్ ఐటీ: పోస్టులు- 146, ఖాళీలు 127.

మొత్తం పోస్టులు: 2,825 ఉండగా.. ఇందులో 1,977 ఖాళీలున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment