Crime News: దారుణం.. యువతిని హత్య చేసి కాల్చేశారు.. మెదక్ జిల్లా చేగుంట మండంలం వడియారం సమీపంలో కాలిపోయిన ఓ యువతి మృతదేహం వెలుగుచూడటం కలకలం రేపింది. దాదాపు 25 ఏళ్లున్న ఓ యువతిని దుండగులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆధారలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. By B Aravind 05 Dec 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి మెదక్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం చేగుంట మండలం వడియారం సమీపంలో ఓ గుర్తుతెలియని యువతిని హత్యచేసి కాల్చివేయడం వెలుగుచూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దాదాపు 25 ఏళ్లున్న గర్తు తెలియని యువతి మృతదేహం హైదరాబాద్కు వెళ్లే రహదారిపై సగం కాలిపోయిన స్థితిలో ఉందని స్థానిక ఎస్సై హరీశ్ తెలిపారు. సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించామని.. దుండగులు ఎవరో ఆమెను ఎక్కడో వేరే చోట హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పంటించారని అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తోందని చెప్పారు. Also read: సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం.. ఖర్గే అయితే మృతురాలి ఒంటిపై కాషాయ రంగు టాప్, ఎరుపు లెగ్గిన్ ఉందని పేర్కొన్నారు. మృతురాలి గుర్తు తెలిసిన వ్యక్తులు, సంబంధిత బంధువులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీసుస్టేషన్, రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. Also read: తెలంగాణకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ.. లోక్సభలో బిల్లు #telugu-news #murder #crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి