Hyderabad: దారుణం.. లవ్ బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని కత్తితో దాడి చేసిన ప్రియుడు.. లవ్ బ్రేకప్ చెప్పిందని ప్రియురాలని ప్రియుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగింది. చివరిసారిగా మాట్లాడుదామని పిలిచి ఆమెపై దాడి చేసి ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By B Aravind 06 Nov 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. లవ్ బ్రేకప్ చెప్పడంతో ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే డీఏఈ కాలనీకి చెందిన ఈ ఇద్దరు ప్రేమికులు చిన్ననాటి మిత్రులు. స్కూల్ నుంచే వీళ్లిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ వచ్చింది. అయితే బీటెక్ చేస్తున్న సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి లవ్ బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రియుడు వర్ష్ ఆమెపై పగ పెంచుకున్నాడు. చివరిసారిగా మాట్లాడుదామని తన ప్రియురాలని పిలిచాడు వర్ష్. మౌలాలిలో ఓ కాలనీలో కారులో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే బ్రేకప్ ఎందుకు చెప్పావని వర్ష్ ఆమెతో గొడవ దిగాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆమెపై అతడు కత్తితో దాడి చేశాడు. అమ్మాయి కేకలు వేయడంతో అక్కడి స్థానికులు వచ్చి కారు అద్దాలు పగలగొట్టారు. ఆ తర్వాత వారిద్దరని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: కేసీఆరే మంచోడు.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్.. #hyderabad-crime #crime-news #love-breakup #love సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి