Air India: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్‌ లీవ్‌ పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి.

New Update
Air India: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

Air India Express cancels 70 flights: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్‌ లీవ్‌ (Sick Leave) పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్‌ సిబ్బంది అంతా కూడా ఒకేసారి చివరి నిమిషంలో సిక్‌ లీవ్‌ పెట్టడంతో మంగళవారం రాత్రి నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరు తెలిపారు.

ఉద్యోగులు అంతా ఒక్కసారిగా సిక్‌ లీవ్‌ ఎందుకు పెట్టారు అనే విషయం తెలియడం లేదని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. విమానాలు క్యాన్సిల్‌ అయ్యి ప్రయాణాలు రద్దయిన వారందరికీ కూడా రీఫండ్‌ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.లేకపోతే వారు కోరుకుంటే మరోసారి వారికి ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ తో క్యాబిన్ క్రూ సభ్యుల మధ్య వివాదాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించినందుకు డిసెంబర్ 2023లో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Also read: రాజకీయ వారసుడి పై మాయావతి వేటు..కేవలం 5 నెలల్లోనే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

New Update
whatsapp

whatsapp Photograph: (whatsapp)

Whatsapp: మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్‌ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్‌ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

ఉదయం యూపీఐ సేవలు..

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

business | meta | Facebook Meta | instagram | facebook-instagram-down | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు