Heavy rains: భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మార్కండ నదిపై తాత్కాలిక చెక్క వంతెన కొట్టుకుపోయింది. దీంతో గురువారం యాత్రను నిలిపివేయగా.. దాదాపు 50 మంది యాత్రికులు 11,473 అడుగుల ఎత్తులో ఉన్న మద్మహేశ్వర ఆలయం సమీపంలో చిక్కుకుపోయారు.

New Update
Heavy rains: భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో అక్కడికి వచ్చిన 50 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొండచరియలు విరిగిపడి మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక చెక్క వంతెన కొట్టుకుపోయింది. దీంతో గురువారం యాత్రను నిలిపివేయగా.. దాదాపు 50 మంది యాత్రికులు ఏకంగా 11,473 అడుగుల ఎత్తులో ఉన్న మద్మహేశ్వర ఆలయం సమీపంలో చిక్కుకుపోయారు.

Also Read:  స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై కోదండరాం ఫైర్‌

ఇదిలాఉండగా.. గత కొద్దిరోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. గత ఏడాది కూడా ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. చివరికి ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వారిని రక్షించాయి.

Also read: ఇకపై నో టోల్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Rains

Rains

ఉపరితల ఆవర్తనం వల్ల మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వరకు గాలులు ఉండవచ్చని తెలిపింది.

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇదిలా ఉండగా.. ఏపీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment