Ganja : గంజాయి తాగించి టెన్త్ అమ్మాయిపై అత్యాచారం! జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ అమ్మాయిని గంజాయికి బానిస చేసి ఆమెపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ్, వెంకటేశ్, నితిన్ లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. By srinivas 24 Mar 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Crime : తెలంగాణ(Telangana) లో మరో గంజాయి(Ganja) కేసు కలకలం రేపుతోంది. ఇటీవల స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా విక్రయదారులు రెచ్చిపోతున్నారు. చాక్లెట్ తదితర రూపాల్లో కిరాణ షాపు(General Store) ల్లోనూ గంజాయి అమ్ముతూ విద్యార్థులను బానిసలుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇదే గంజాయి మత్తులో పదో తరగతి విద్యార్థిని(10th Class Student) పై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి : Holi in Metro: అరే.. ఏంట్రా ఇదీ.. ఛీ మెట్రోలో వీళ్ళు చేసిన పని చూస్తే.. ఐదుగురు అత్యాచారం.. ఈ మేరకు జగిత్యాల(Jagtial) గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ అమ్మాయిని గంజాయికి బానిస చేయడంతోపాటు కొంతమంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆమె తండ్రి ఆరోపణలతో ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లంతా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. సదరు బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ప్రేమ్, వెంకటేశ్, నితిన్గా గుర్తించారు. ఈ ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఇష్యూలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #girl-was-raped #10th-class-student #jagtial #ganja సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి