AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్‌ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి!

ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్‌ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది.

New Update
AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్‌ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి!

HIV: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన ఎయిడ్స్ ప్రపంచదేశాల్లో మళ్లీ విజృంభిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల చేపట్టిన రిసెర్స్ ఆధారంగా 2023 ముగిసే నాటికి 4 కోట్ల మంది హెచ్‌ఐవీ (HIV)తో బాధపడుతున్నట్లు పేర్కొంది. 90 లక్షల మందికి పైగా ఎలాంటి చికిత్స తీసుకోకపోవడంతో నిమిషానికి ఒకరు చనిపోతున్నట్లు తెలిపింది.

2023లో 6.3లక్షల మంది మరణం..
ఈ మేరకు 2004లో 21లక్షల మంది ఎయిడ్స్ కారణంగా చనిపోగా 2023లో 6.3లక్షల మంది మరణించినట్లు తెలిపింది. 2025 నాటికి ఈ సంఖ్యను 2.5లక్షలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఎయిడ్స్‌ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దీన్ని అరికట్టడంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కిడం లేదు. దీని నిర్మూలనకు నిధులు కేటాయిస్తున్నాం. అయినా పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, తూర్పు యూరప్‌, మధ్య ఆసియా, లాటిన్‌ అమెరికాలో ఈ కేసులు పుట్టుకొస్తున్నట్ల పేర్కొంది.

ఇది కూడా చదవండి: Union Budget 2024: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం!

ఇక లింగ అసమానతలపై ప్రభావం.. హెచ్‌ఐవీ విజృంభణ లింగ అసమానతలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెక్స్‌ వర్కర్లు, వివాహేతర సంబంధాలు దీన్ని పెరుగుదలకు ముఖ్య కారణమవుతోందని, డ్రగ్స్‌ ఇంజెక్ట్‌ చేసే వ్యక్తుల సంఖ్య 2010తో పోలిస్తే.. 45 నుంచి 55 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్‌ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపింది. 2025 నాటికి కొత్త హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌లను 3.7 లక్షల కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023లో కొత్త ఇన్‌ఫెక్షన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 1.3 మిలియన్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment