Delhi: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి

ఢిల్లీలో పడిన భారీ వర్షానికి అక్కడ ఓ కోచింగ్ సెంటర్ మొత్తం నీటితో మునిగిపోయింది. దీంతో బిల్డింగ్ బేస్‌మెంట్‌లోకి విపరీతంగా నీరు చేరిపోయింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు.

New Update
Delhi: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి

Old Rajender Nagar incident: నిన్న సాయంత్రం ఢిల్లీలో పడిన భారీ వర్షం కారణంగా రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్ మెంట్ వరద నీటితో నిండిపోయింది. ఈ నీటిలో మొత్తం 30మంది విద్యార్ధులు చిక్కుకుపోయారు. వారిలో 27మంది తప్పించుకోగా...ముగ్గురు విద్యారధులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కాగా ఒకరు అబ్బాయి. రాత్రి ఏడుంపావు గంటల సమయంలో కోచింగ్ సెంటర్‌లో విద్యార్ధులు చిక్కుకుపోయారని.. రాజేంద్రనగర్ ఫైర్ ఆఫీస్‌కు కాల్ వచ్చింది. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లను అక్కడకు పంపించారు. అక్కడ వారు వెంటనే రెస్క్యూ ఆపేషన్ కూడా ప్రారంభించారు. కొన్నింగల తర్వాత ఫైర్ సిబ్బంది విద్యార్ధుల మృత దేహాలను బయటకు తీయగలిగారు.

మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఇంకా కోచింగ్ సెంటర్ దగ్గర సహాయక చర్యలు కొనసాగింారు. నీటిని అంతా బయటకు పంపడానికి ప్రయత్నం చేశారు. ఇంకా కొంత మంది బేస్‌ మెంట్‌లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమకు అందిన సమాచారం మేరకు అందరు విద్యార్ధులూ సురక్షితంగా బయటకు వచ్చారని..కేవలం ముగ్గురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ ఢిల్లీ) M హర్షవర్ధన్ తెలిపారు.

ఈ ఘటనపై ఢిల్లీ ఆప్ మినిస్టర్ అతిషి వెంటనే స్పందించారు. స్థానిక AAP ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నారని, అలాగే మేయర్ షెల్లీ ఒబెరాయ్ కూడా చేరుకున్నారని చెప్పారు. ఈ ఘటనలో దోషలుగా తేలిన వారిని విడిచిపెట్టమని మంత్రి అతిషి చెప్పారు.

Also Read:Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండకకు లక్ష్యసేన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment